English | Telugu

Guppedantha Manasu: గుప్పెడంత మనసులో కీలక మలుపు.. అభిమానులకి మైండ్ బ్లాక్!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -916 లో... వసుధార రిషి ఇద్దరు పెళ్లి చేసుకున్నారని ఏంజిల్ తట్టుకోలేకపోతుంది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అన్న బాధ కంటే, తనకి చెప్పకుండా చేసుకున్నారు అన్న బాధే ఏంజిల్ లో ఎక్కువగా ఉంది. అందుకే రిషి జరిగింది మొత్తం చెప్పినా ఏంజెల్ నమ్మకుండా అదంతా ఒక నాటకమని మాట్లాడేసరికి రిషి మరింత వివరంగా చెప్తాడు.

ఏంజిల్ ఎంత చెప్పిన వినకపోయేసరికి వసుధార కలుగజేసుకొని మా పరిచయం ఇప్పటిది కాదు. నేను రిషి సర్ స్టూడెంట్ ని మా మధ్య ప్రేమ మొదలై పెళ్లి వరకు వచ్చిందని ఏంజిల్ కి వసుధార చెప్తుంది. ఎన్నిసార్లు మీ మీద నాకు డౌట్ వచ్చి అడిగిన.. మీరు చెప్పలేదు. నేను మిమ్మల్ని చాలా నమ్మాను. నన్ను మోసం చేశారని ఏంజిల్ బాధపడుతుంది. అప్పుడు రిషి సర్ చెప్పే పరిస్థితిలో లేడు. తనని కాదని నేను చెప్పలేదని వసుధార అంటుంది. ఆ తర్వాత విశ్వనాథ్ దగ్గర రిషి వసుధార ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు. మరొకవైపు విశ్వనాథ్ ఇంట్లో ఉన్న అనుపమకి బయట ఏదో మాటలు వినిపిస్తున్నాయని బయటకు వస్తుండగా.. అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఫోన్ చెయ్యడంతో ఆగిపోతుంది. మరొకవైపు వసుధారకి ఏంజిల్ చేతుల మీదుగా చీర తాంబూలం విశ్వనాథ్ ఇప్పిస్తాడు. ఆ తర్వాత మీరు నన్ను ఒక తెలివి తక్కువ దదమ్మ లాగా చేశారని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత రిషి వసుధార ఇద్దరు బయల్దేరి వెళ్తారు. ఆ తర్వాత పై నుండి కిందకి వస్తున్న అనుపమని చూసి విశ్వనాథ్ ఆశ్చర్యపోతాడు.. అనుపమ ఇన్ని రోజులకి ఈ నాన్న గుర్తుకు వచ్చాడా ఇన్ని రోజులకి నాపై కోపం తగ్గిందా అని అనగానే ఏంజిల్ షాక్ అవుతుంది. ఆ తర్వాత అనుపమని ఏంజిల్ కి విశ్వనాథ్ పరిచయం చేస్తాడు. అనుపమ నా కూతురు నీకు అత్తయ్య అని ఏంజెల్ ని పరిచయం చేస్తాడు.

మరొకవైపు జగతి ఫోటో దగ్గరికి వచ్చి.. మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. ఇక నేను తాగాను అంటూ తమ జ్ఞాపకాల డైరీని చూస్తూ ఉంటాడు. అనుపమని గురించి అడుగుతుంది‌. నేనేం మాట్లాడలేకపోయానంటు మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మరొక వైపు అనుపమ బట్టలు సర్దతు ఉంటే.. ఒక ఫోటో కిందపడి పోతుంది. చూపించు అత్తయ్య అని ఏంజిల్ అడుగుతుంది. అది నా పర్సనల్ అని ఆ ఫోటో ని ఏంజిల్ కి చూపించదు. మరొక వైపు ఏంజిల్ మన మాట వినట్లేదు కానీ విశ్వనాథ్ గారు మన సిచువేషన్ అర్థం చేసుకున్నారని రిషి, వసుధార ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.