English | Telugu

Guppedantha Manasu : మను కోసం మహేంద్ర ఆరాటం.. అన్నకి ఎదురుతిరుగుతాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1054 లో.. అసలు మహేంద్ర ఏం చెప్పాలని ఇక్కడికి వస్తున్నాడు.. ఎందుకు ఇన్విటేషన్ అంటూ దేవయాని అంటుంటే.. వస్తున్నాడు కదా తెలుస్తుందంటూ ఫణింద్ర అంటాడు. బాబాయ్ వేరే కాలేజీ ఓపెన్ చేస్తున్నాడేమో ఆ కాలేజీ ఓపెనింగ్ కి రమ్మని చెప్పడానికి వస్తున్నాడు కావచ్చు.. ఆ కాలేజీకి ఆ మనుని ఎండీని చేస్తాడేమో అందుకే కాలేజీ నుండి వెళ్లిపోతానని అంటున్నాడని శైలేంద్ర అంటాడు. అందుకే నిన్ను తిట్టేదంటు శైలేంద్రపై ఫణీంద్ర అరుస్తాడు.

మరొకవైపు వసుధార, మహేంద్ర ఇద్దరు కార్ లో వస్తుంటారు. మీ నిర్ణయం వల్ల అనుపమ గారు బాధపడుతున్నారని వసుధార అనగానే.. తను ఇప్పుడు బాధపడటమేంటి.. తను ఎప్పటినుండో బాధపడుతుంది. పైకి హ్యాపీగా ఉన్నా లోపల ఎంత బాధపడుతుంది. అందుకే తన బాధ పొగట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని మహేంద్ర అనగానే.. దీనివల్ల మను నిజమైన తండ్రి ఎదురుతిరిగితే అని వసుధార అడుగుతుంది. అలా బయటకు రావాలనే ఇదంతా చేస్తున్నా.. ఇలా చేస్తే అయిన మను తండ్రి ఎవరనేది అనుపమ చెప్తుందనే ఆశ అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మహేంద్ర, వసుధార ఇద్దరు ఫణీంద్ర దగ్గరికి వెళ్తారు‌. కాఫీ తీసుకొని రా ధరణి అని ఫణీంద్ర చెప్పగానే.. ముందు ఏదో చెప్తానన్నాడు కదా అదేంటో చెప్పమనండి అని దేవయాని అంటుంది. నేను కూడా టీ, కాఫీలు తాగడానికి రాలేదు.. ఇన్ఫర్మేషన్, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చానని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మనుని తను దత్తత తీసుబోతున్నట్లు చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏం చేస్తున్నావ్? కొంచెం ఆలోచించని ఫణీంద్ర అంటాడు. దేవయాని కూడా మహేంద్రపై విరుచుకుపడుతుంది. ఎవరేం చెప్పినా నేను విననని మహేంద్ర అంటాడు.

నువ్వు అయిన చెప్పొచ్చు కదా అని వసుధారతో ఫణీంద్ర అంటాడు. నాకు ఆ నిర్ణయం సరైనదే అనిపిస్తుంది.. ఈ విషయం పూర్తిగా మావయ్య గారికే వదిలేసానని వసుధార అంటుంది.. ఆ తర్వాత మనుకి శైలేంద్ర ఫోన్ చేసి.. మీ అమ్మ నువ్వు ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నారా అని మనుని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. దత్తత విషయం తెలియని మను కోపంగా మహేంద్ర దగ్గరకి వెళ్తాడు. మహేంద్ర లేడని అనుపమ చెప్తుంది.. ఆ శైలేంద్ర దగ్గరికి వెళ్లాడా? ఎందుకు వెళ్ళాడో తెలుసా అని మను అనగానే.‌. తెలుసని అనుపమ అంటుంది. తెలిసే ఇలా ఉన్నారా.... వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉంటానని మను వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటాడు. మరొకవైపు ఆ మనుని దెబ్బ కొట్టాలంటే మనం ఇద్దరం సరిపోతామని దేవయానితో శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.