English | Telugu

Guppedantha Manasu : ఆ పోస్టర్లని చూసి షాకైన మను, వసుధార.. వారి ప్లాన్ సక్సెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1018 లో.. రాజీవ్ కాలేజీలో ఉన్న వసుధార, మనుల ఫోటోలని కొత్త ప్రేమప్రయాణం అంటూ పోస్టర్లు అంటిస్తాడు. అ విషయం ఎలాగైనా శైలేంద్రకి చెప్పాలని ఫోన్ చేస్తుంటాడు. కానీ శైలేంద్ర నిద్రలో ఉండి ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. పోస్టర్ అంటించింది వీడియో తీసి శైలంద్ర దగ్గరికి వెళ్తాడు.

ఆ తర్వాత నిద్రలో ఉన్న శైలేంద్ర.. నా భయ్యా అంటూ రాజీవ్ లేపేసరికి అప్పుడే ధరణి నిద్ర లేస్తుంది. ధరణి ఎక్కడ చూస్తుందోనని రాజీవ్ బెడ్ కింద దాక్కుంటాడు. ఇక శైలేంద్ర కవర్ చేస్తు.. ఎవరు లేరని కాఫీ తీసుకొనిరా అని పంపిస్తాడు. ఆ తర్వాత శైలేంద్ర రాజీవ్ ని తీసుకొని బయటకు వచ్చి.. ఎందుకు వచ్చావంటు అడుగుతాడు. పోస్టర్ అంటించిన వీడియో రాజీవ్ చూపించగానే మన ప్లాన్ సక్సెస్ అని అంటాడు. ఆ తర్వాత రాజీవ్ వెళ్ళిపోయాక శైలేంద్ర లోపలికి వస్తాడు. చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడేం జరిగిందని ధరణి అడుగుతుంది... నీకు చెప్పిన అర్ధం కాదులే గానీ రేపు నువు నాతో పాటు కాలేజీకి రావాలి.. ఒక అద్భుతమైన సినిమా వెండితెరపై చుపిస్తానని అనగానే ధరణికి ఏం అర్ధం కాదు.

మరుసటిరోజు ఉదయం అందరు స్టూడెంట్స్ రాజీవ్ అంటించిన పోస్టర్ చూసి ఆశ్చర్యంగా చూస్తుంటారు. మరొకవైపు ధరణిని తీసుకొని శైలేంద్ర కాలేజీకి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ వసుధార, మనుల పోస్టర్లు చూసి ధరణితో పాటు అనుపమ, మహేంద్ర షాక్ అవుతారు. అప్పుడే వసుధార వచ్చి చూసి షాక్ అవుతుంది. ఏంటి ఇది అని వసుధార అడుగుతుంది. ఎవరో కావాలనే ఇదంతా చేశారని మహేంద్ర అంటాడు. అప్పుడే మను వచ్చి పోస్టర్ చూస్తాడు. మను ఇదేంటని అనుపమ అడుగుతుంది. నాకేం తెలియదని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.