English | Telugu

Guppedantha Manasu:సంతకం గురించి మను, వసుధారల మధ్య తగ్గపోరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1009 లో.. ఫణింద్ర దగ్గరికి మహేంద్ర వస్తాడు. నీతో ఈ విషయం డిస్కషన్ చెయ్యడానికి ఇబ్బందిగా ఉన్నా సరే తప్పడం లేదు.. రిషికి కర్మకాండ జరిపించాలి. అపుడే తన ఆత్మ శాంతిస్తుందని ఫణీంద్ర అంటాడు. వద్దు అన్నయ్య ఇంకా వసుధర రిషి ఉన్నాడని అనుకుంటుందని మహేంద్ర అంటాడు. నేను అయితే రేపే రిషి కర్మకాండ జరిపించాలని అనుకుంటున్నానని ఫణింద్ర అనగానే మహేంద్ర షాక్ అవుతాడు. ఈ విషయం తెలిస్తే వసుధార తట్టుకోలేదని మహేంద్ర అంటాడు.

ఆ తర్వాత దేవయని, శైలంద్ర ఇద్దరు యాక్టింగ్ చేస్తూ అలా చేయకుండా ఉంటే ఎలా? రిషి ప్రశాంతంగా ఉండగలడా అని అంటారు. ఇదంతా చేసేది ఆ వసుధారని దూరంగా పంపించడానికే కదా అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. ఈ విషయం గురించి వసుధారతో చెప్పకు మనమే చేద్దామని ఫణింద్ర అంటాడు. అయిన మహేంద్ర ఒప్పుకోడు. సరే నేను ఒక తండ్రి స్థానంలో ఉండి ఇదంతా చేస్తాను.. నీకు ఒకేనా నువ్వు వస్తావా అని ఫణీంద్ర అంటాడు. మీ ఇష్టం అన్నయ్య అని మహేంద్ర చెప్పి వెళ్లిపోతాడు. దాంతో శైలేంద్ర, దేవయని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు మేడమ్ ఈ ఫైల్ పై.. మీరు మను సర్, సైన్ చెయ్యాలి. మీరు చేసాక మను సర్ చేస్తానని అన్నారని కాలేజీ ఫ్యూన్ ఫైల్ తీసుకొని వచ్చి వసుధారకి ఇస్తాడు. వసుధార కోపంగా ఎండీని నేను చివరగా సంతకం చేయాల్సింది కదా.. నేను ముందు తనని చేయమని చెప్తుంది. అదే విషయం సర్ తో చెప్తే మిమ్మల్ని ఫస్ట్ చెయ్యమని చెప్పారని అనగానే వసుధర ఆ ఫైల్ తీసుకొని కోపంగా మను క్యాబిన్ కి వెళ్తుంది. ఏంటి ఎండీ అనుకుంటున్నారా? సంతకం చివర్లో చేస్తానని అన్నారట అని వసుధార కోప్పడుతుంది. అవును మీరు చూసి ఒకే చేస్తేనే నేను సంతకం పెడతానని మను అంటాడు.

ఆ తర్వాత మనుపై వసుధార సీరియస్ అవుతుంది. ఇద్దరు సంతకం మీరే ముందు పెట్టాలంటే మీరే ముందు పెట్టాలని అనుకుంటారు.. ఆ తర్వాత రిషికి కర్మకాండ చేస్తున్న విషయం వసుధారకి చెప్పాలని ధరణి అనుకుంటుంది. అప్పుడే దేవయాని శైలేంద్ర వచ్చి ఫోన్ లాక్కొని.. ఈ ఫోన్ రేపు పని పూర్తయ్యాక ఇస్తాను. నువ్వు వసుధారకి చెప్తే నీ సంగతి చెప్తానంటు ధరణికి శైలేంద్ర వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత మహేంద్ర కాలేజీకి రాగానే.. ఏంటి ఫణింద్ర ఎందుకు పిలిచాడని అనుపమ, వసుధార ఇద్దరు అడుగుతారు. మహేంద్ర ఇబ్బందిపడుతూనే వట్టిగనే పిలిచాడు. హెల్త్ బాలేదంట అందుకే అని చెప్తాడు. కానీ వసుధారకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.