English | Telugu

Guppedantha Manasu : ఎండీగా రిషి.. మరోసారి శైలేంద్రని ఫూల్ చేశాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1155 లో ... ఫణీంద్రకి దేవయాని ఫోన్ చేసి.. మీటింగ్ లో ఏం జరుగుతుంది? ఎవరు ఎండీగా నిర్ణయం తీసుకున్నారని అడుగుతుంది.ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఫణీంద్ర అంటాడు. శైలేంద్ర ఏం చేస్తున్నాడని దేవయాని అడుగగా.. వాడు ఇక్కడ లేడు.. ఎక్కడ ఏ రాచకార్యాలు వెలగపెడుతున్నాడో వాడికే ఫోన్ చేసి కనుక్కోమని ఫణీంద్ర కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. నేను అనుకున్నదే కరెక్ట్.. శైలేంద్ర ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నాడని దేవయాని అనుకుంటుంది. వెంటనే తన రూమ్ లోకి వచ్చి మనుకి వసుధార రాసిన లెటర్ ని ఫోటో తీసి శైలేంద్రకి పంపిస్తుంది.

అదంతా దూరం నుండి ధరణి చూస్తుంటుంది. మరొకవైపు మీటింగ్ లో అందరూ రిషిని ఎండీ గా ఉండాలని అంటారు. వసుధార గారు అన్నట్లు మీరు ఉండగా వేరొకరు ఎండీ పదవికీ తగరని బోర్డు మెంబర్స్ అంటారు. అందరు అనడంతో రిషి ఎండీగా ఉండడానికి ఒప్పుకుంటాడు. మరొకవైపు శైలేంద్ర ఫోన్ కి దేవయాని పంపిన లెటర్ ని మను చదివి షాక్ అవుతాడు. అది నిజం..వసుధార వెళ్లిపోయినప్పుడు నీకు ఆ లెటర్ రాసింది .. నేనే మార్చేసా అని శైలేంద్ర చెప్తాడు. మను ఆ లెటర్ చదివి షాక్ అవుతాడు. అప్పుడే దేవయాని ఫోన్ చేసి.. నువ్వు శైలేంద్రని కిడ్నాప్ చేసావని నాకు తెలుసు.. కానీ ఇప్పుడు శైలేంద్రని వదిలిపెట్టు.. మా కల నిజమయ్యే టైమ్.. నువ్వు ఏదైనా ఉంటే ఆ మహేంద్ర, అనుపమలతో తేల్చుకోమని దేవయాని అంటుంది. ఈ విషయం ఎవరితో చెప్పనంటేనే నేను వదిలి పెడతానని మను అనగానే.. ఎవరితో చెప్పమని దేవయాని అంటుంది. ఆ తర్వాత శైలేంద్రని మను వదిలిపెడతాడు.

అ తర్వాత శైలేంద్ర కాలేజీకీ వెళ్లి.. నేనొచ్చాను కదా ఇక ఎండీని ప్రకటించండి అని అనగానే ఆల్రెడీ ఎండీగా రిషి అని నిర్ణయం తీసుకున్నామని ఫణీంద్ర అనగానే.. అలా ఎలా అవుతాడని శైలేంద్ర అనగానే తనపై ఫణీంద్ర కోప్పడతాడు. ఇంత మోసం చేస్తాడా అని రిషిపై శైలేంద్ర కోపంగా ఉంటాడు. కాని రిషి నే రివర్స్ గా.. టైమ్ కి ఎక్కడికి వెళ్ళావ్ .. ఆ మేడమ్ నా పేరు చెప్పింది. అయినా నేను వద్దనన్నానంటూ శైలేంద్రని ఫూల్ ని చేస్తాడు రిషి. నువ్వు అయితే రేపు అయిన నన్ను చేస్తావ్ గా అంటూ శైలేంద్ర ధీమాగా ఉంటాడు. మరొకవైపు మహేంద్రనే నీ కన్నతండ్రి అని శైలేంద్ర చెప్పిన విషయాన్ని మను గుర్తుకుచేసుకుంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.