English | Telugu

Guppedantha Manasu : నేను ఎలా ఉన్నా నన్ను గుర్తుపడతావని నాకు తెలుసు వసుధార...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1107 లో... నేను తినను అని కోపంగా బయటకు వచ్చి కూర్చుంటుంది వసుధార. ఆ తర్వాత రంగా భోజనం తీసుకొని వసుధార దగ్గరికి వస్తాడు. వసు వెనకాల ఉన్న రంగాని వసుధార పిలుస్తుంది. మీరు వచ్చారని తెలుసు రండీ సర్ అని అంటుంది. మేడమ్ గారు భోజనం చెయ్యండి అని రంగా అంటాడు. నాకు అవసరం లేదని వసుధార అంటుంది. మీరు ప్రతిసారీ రిషి సర్ రిషి సర్ అంటుంటే మా నానమ్మకి ఏం అర్థం అవడం లేదు. మీరు అలా అనకండి అని రంగా అంటాడు. ఆ మాటలు అన్ని సరోజ వింటుంది.

ఆ తర్వాత రంగా రిక్వెస్ట్ చెయ్యడం తో వసుధార భోజనం చేస్తుంది. సర్ ఇప్పుడు తృప్తిగా ఉందని వసుధార అంటుంది. అప్పుడే రంగా ఫ్రెండ్ వస్తాడు. అన్న మేడమ్ గారి కోసం ఎవరో వెతుకుతున్నారని వసుధార ముందే చెప్తాడు. దాంతో మీరేం టెన్షన్ పడకండి మేడమ్ గారు.. మీరు ఇక్కడే ఉండండి మీకేం ప్రాబ్లమ్ రానివ్వనని రంగా చెప్తాడు. మీరు రిషి సర్ కాదంటున్నా మీ మాట మీ చూపు అంత కూడా నన్ను మోసం చెయ్యవ్ సర్ కానీ మీరు ఎందుకు ఇలా ఇక్కడుంటున్నారో తెలియడం లేదని అని వసుధార అనుకుంటుంది. మరొకవైపు దేవయాని, ఫణీంద్రలు మహేంద్ర దగ్గరికి వస్తారు. నీకు జరిగిన నష్టం ఎవరు తీర్చలేనిది అని ఫణీంద్ర అంటాడు. నీపై బెంగపెట్టుకొని మీ అన్నయ్య సరిగ్గా తినడం లేదు.. పడుకోవడం లేదని దేవయాని అంటుంది. నువ్వు ఇక్కడ ఉంటే నాకు నీ గురించి టెన్షన్ గా ఉంది. నువ్వు మాతో పాటు అక్కడే ఉండమని ఫణీంద్ర అనగానే నేను రానని మహేంద్ర అంటాడు. అప్పుడు జరిగిన దానిని మనసులో పెట్టుకొని అంటున్నావ్ కదా.. అప్పుడు నీవు ఏమైపోతావోనన్న బాధలో అన్నాను దానికి సారీ కూడా చెప్పానని దేవయాని అంటుంది. నేను రాలేను అర్థం చేసుకోండని మహేంద్ర అంటాడు. సరే నేను వెళ్తాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్ అని ఫణీంద్ర అంటాడు. మహేంద్రకి ఏదైనా ఇష్టమైన వంట చేసి తీసుకొని వస్తానని దేవయాని చెప్పగా.. ఫణీంద్ర సరేనని వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత అనుపమ కిచెన్ లో ఉంటే దేవయాని వెళ్తుంది. అప్పుడే మహేంద్ర కూడా వెళ్తాడు. దేవయాని తన మాటలతో అనుపమని బాధపెడుతుంది. మరొకవైపు వసుధార దగ్గరికి రంగా వస్తాడు. తను నిద్రపోతు ఉంటుంది. రిషి సర్ అంటూ ఒక్కసారిగా లేచి చూస్తుంది వసుధార. దాంతో వసుధార చెయ్యిని రంగా పట్టుకొని.. నేను ఎలా ఉన్నా నన్ను గుర్తుపడతావని తెలుసు వసుధార .. నేను ఎందుకు ఎలా రంగా ఉంటున్నానో అర్థం చేసుకోమని వసుధారకి చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు తెలుసు మీరు నా రిషి సర్ అని వసుధార అంటుంది. మనది రిషీధారల బంధం వసుధార అని రిషి అంటాడు. డాడ్ ఎలా ఉన్నాడు.. నాకు చూడాలని ఉంది వెళ్దామా అని రిషి అనగానే.. పదండి సర్ అని వసుధార రిషి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగింందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.