English | Telugu

Guppedantha Manasu : రిషి సర్ కన్పించారు.. మనుషుల ఎమోషన్స్ తో ఎందుకు ఆడుకుంటున్నావ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1094 లో..... రిషి గురించి వసుధార బాధపడుతుంది. అందరు రిషి సర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. రిషి సర్ లేరని అంటున్నారని వసుధార ఎమోషనల్ అవుతుంది. ఎవరు నమ్మిన నమ్మపోయిన నేను నమ్ముతున్నా..‌ నీ నమ్మకం నిజం అవ్వాలని మహేంద్ర అనగానే అది జరగదని శైలేంద్ర అంటాడు. రిషి రాడు లేడని శైలేంద్ర అంటాడు. ఇంకొకసారి అలా అనకని వసుధార కోప్పడుతుంది.

ఉరుకుంటున్నాం కదా అని రెచ్చిపోతున్నావని మహేంద్ర కోప్పడతాడు.. రిషి సర్ బ్రతికే ఉన్నాడు.. లేదంటే నా ఊపిరి ఆగిపోయేదని ఎందుకు అంటున్నావ్.. నాకు తెలుసని శైలేంద్ర అనగానే ఎందుకని వసుధార అంటుంది. ఎండీ చైర్ కోసం ఆ సీట్ లో పర్మినెంట్ గా కూర్చోవాలని నీ ఆశ అందుకే అలా కలరింగ్ ఇస్తున్నావని శైలేంద్ర అనగానే.. నేను నీలాగా కాదు. ఎందుకు అలా మాట్లాడి నన్ను ఇబ్బంది పెడుతున్నావంటూ వసుధార అంటుంది.. అప్పుడే మను వస్తాడు. వచ్చావా ఇంకా రాలేదని చూస్తున్నానని శైలేంద్ర వెటకారంగా మాట్లాడుతాడు. నీకు ఒక గోల్ ఉంది ‌. నీ తండ్రి ఎవరో తెలుసుకోవాలని.. అది కాకుండా మా విషయాలను ఎందుకు పట్టించుకుంటావని మనుని శైలేంద్ర అంటాడు. ఇంతవరకు రిషి రాలేదంటే లేడనే అర్ధం కదా వాళ్లకు చెప్పు రిషి రాడని శైలేంద్ర మనుతో అనగానే.. వస్తాడని మను అంటాడు‌. కావాలనే శైలేంద్ర వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు.

మరొకవైపు దేవయాని పేపర్ చదువుతుంటే.. రిషి కన్పించడం లేదని ప్రకటన కన్పిస్తుంది. అది చూసి ఫణీంద్రతో దేవయాని చెప్తుంది. ఈ వసుధార ఇలా చేస్తుందేంటి.. అసలు మీ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి ఇదంతా చేస్తుందని దేవయాని అనగానే.. నువ్వు ఇక మారవా అంటూ దేవయానిపై ఫణీంద్ర విరుచుకుపడుతాడు. మరొకవైపు ఎవరో వసుధారకు ఫోన్ చేసి.. రిషిని చూసానని అనగానే.. వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి కన్పించిన అడ్రెస్ చెప్పగానే.. వసుధార, మను ఇద్దరు అక్కడికి వెళ్తారు. వెళ్లేసరికి అక్కడ శైలేంద్ర టీ తాగుతూ ఉంటాడు. ఎందుకు మనుషుల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావని శైలేంద్రపై వసుధార కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.