English | Telugu

Guppedantha Manasu : వాడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1080 లో... మనుకి శైలేంద్ర ఫోన్ చేస్తాడు‌ ఎక్కడున్నావని అడుగుతాడు. మహేంద్ర సర్ ఇంట్లో ఉన్నానని మను అంటాడు. ఎక్కడ మను మనసు మారుస్తారోనని శైలేంద్ర అనుకొని.. నువ్వు వెంటనే అక్కడ నుండి వచ్చేయ్ వేరే ఎక్కడైనా ఉండడానికి ఏర్పాట్లు చేస్తానని శైలేంద్ర అంటాడు. మను నవ్వుకుంటూ నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావని ఫోన్ కట్ చేస్తాడు.

మరుసటి రోజు ఉదయం వసుధార, మహేంద్ర కాలేజీ కి రెడీ అవుతారు. ఈ రోజు శైలేంద్రకి మనమిచ్చే షాక్ మామలుగా ఉండదని వసుధార అనగానే.. మరి ఏంటి వాడు ఎన్ని అరాచకాలు, మోసాలు, కుట్రలు చేసాడని మహేంద్ర అంటాడు. వాడు ఎండీ పదవి కోసం ఎన్ని చేసాడు. ఇప్పుడు రాజీవ్ ని పట్టించింది కూడా అందుకే.. అసలు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని మహేంద్ర అంటాడు. ఈ రోజు మనం కొట్టె దెబ్బకి దిమ్మతిరిగిపోవాలని మహేంద్ర అంటాడు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. తను చేసిన నేరాలకి శిక్ష పడాలి. కాలేజీకి దూరంగా ఉండాలి కానీ ఇప్పుడు దూరం పెడితే తన తప్పులు నిరూపించలేము.. అందుకే సైలెంట్ గా ఉండవలసి వస్తుందని వసుధార అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కాలేజీకి బయల్దేరతారు. మను దగ్గరికి శైలేంద్ర వచ్చి.. అంత ఒకే కదా అని అడుగుతాడు. ఓకేనా అంటే ఏంటని మను అంటాడు. అదే రాత్రి ఏమైనా మనసు మార్చుకున్నావా అని అడుగుతాడు. నేను ఒకసారి చెప్పాక మనసు మార్చుకోవడం ఉండదని మను అంటాడు.

ఆ తర్వాత వసుధర కూడా అక్కడికి వస్తుంది. ఏంటి కాబోయే ఎండీ.. ఇక్కడున్నాను కనీసం అడిగి రావట్లేదని శైలేంద్ర అంటాడు. ఇప్పుడు ఎండీ అయితే నేనే కదా అని వసుధార అంటుంది. తర్వాత బోర్డు మీటింగ్ అరెంజ్ చేస్తారు. శైలేంద్ర తనని ఎప్పుడెప్పుడు ఎండీ గా చేస్తారో ఎక్సయిట్ మెంట్ తో ఉంటాడు.. కానీ బోర్డు మీటింగ్ లో మను కాలేజీకి ఇచ్చిన యాభై కోట్లు అప్పు మాఫీ చేశారని చెప్పి మీటింగ్ ముగించేసరికి శైలేంద్ర షాక్ అవుతాడు. నన్ను ఎండీగా చెయ్యడం లేదా అని శైలేంద్ర అనగానే.... ఏంటి శైలేంద్ర అలా చేస్తున్నావ్? ఈ మధ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావంటూ ఫణీంద్ర కోప్పడతాడు. ఫణీంద్ర వెళ్ళిపోయాక.. ఏంటి ఇంత మోసం చేసారంటూ శైలేంద్ర అంటాడు. ఇదంత తమ ప్లాన్ అని మహేంద్ర వాళ్ళు చెప్పగానే శైలేంద్ర షాక్ అవుతాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.