English | Telugu

Guppedantha Manasu : వేరే అమ్మాయితో ఛాటింగ్ చేస్తున్నాడంటూ భర్తపై భార్య ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1069 లో.. వసుధార దగ్గరికి అనుపమ వస్తుంది. మనుని ఎలా బయటకు తీసుకొని రావాలో ఆలోచిస్తున్నావా అని అనుపమ అడుగగా.. అవునని వసుధార అంటుంది. అంత ఈజీ కాదమ్మా ఆ శైలేంద్ర, రాజీవ్ లాంటి దుర్మార్గులకి ఎదరు వెళ్తున్నావని అనుపమ అంటుంది. తప్పదు మేడమ్ మను లాంటి వాళ్ళు జైల్లో ఉండకూడదు.. కాలేజీ ప్రాబ్లెమ్ లో ఉన్నప్పుడు ఎంతో హెల్ప్ చేశాడు. రాజీవ్ నాతో గొడవ పడిన ప్రతిసారీ నాకు హెల్ప్ చేశాడు. నాకే కాదు చాలా మందికి హెల్ప్ చేసాడని వసుధార అంటుంది.

ఆ తర్వాత మనుని ఎలాగైనా బయటకు తీసుకొని వస్తానని వసుధార అంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి.. మనుని కచ్చితంగా బయటకు తీసుకొని వస్తాను.. నా ప్రాణం అడ్డు వేసి అయిన సరే.. ఆ శైలేంద్ర, రాజీవ్ ల ప్రాణం తీసి అయిన సరే మనుని తీసుకొస్తానని మహేంద్ర అంటాడు. ఎంతైనా మీ కొడుకు కదా మావయ్య అని వసుధార అనగానే.. అనుపమ సైగ చెయ్యడంతో అదే కొడుకులాంటి వాడు కదా అని వసుధార అంటుంది. మరొకవైపు శైలేంద్ర పడుకున్నాక.. ధరణి తన ఫోన్ తీసుకొని ఓపెన్ చేస్తుంటుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి ఫోన్ లాక్కొని.. ఏం చేస్తున్నావని అడుగుతాడు. ధరణి తెలివిగా. నాకు తెలియకుండా నువ్వు ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నావ్.. ఫోన్ ఇవ్వండి ఎవరో చూస్తానని అంటుంది. నేను ఇవ్వను.. నువ్వు అసలు ఎందుకు తీసుకున్నావని శైలేంద్ర అనగానే.. ఇప్పుడే మీ సంగతి చెప్తానంటూ ఫణింద్ర, దేవయానిని పిలుస్తుంది. నాకు అన్యాయం జరుగుతుంది మావయ్య.. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను.. మీ అబ్బాయి ఎవరితోనో గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతున్నాడు.. మెసేజ్ చేస్తున్నాడని ధరణి అనగానే.. అందరు షాక్ అవుతారు.

ఎందుకు అలా చేస్తున్నావ్? బంగారం లాంటి భార్యని ఇంట్లో పెట్టుకొని అలా ఎందుకు చేస్తున్నావని ఫణీంద్ర అంటాడు. అయ్యో నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నానని శైలేంద్ర అంటాడు. మరి ఫోన్ ఇవ్వమంటే ఇవ్వట్లేదని ధరణి అంటుంది. ఫోన్ చూపించమని ఫణీంద్ర చెప్పగానే.. శైలేంద్ర చూడండి అంటు చూపిస్తాడు. డిలీట్ చేశాడంటు ధరణి అంటుంది. ఇంకొకసారి ఇలాంటివి చేస్తే మర్యాదగా ఉండదని ఫణీంద్ర అంటాడు. నాక్కూడా ఇలాంటివి నచ్చావ్ శైలేంద్ర అంటు దేవయాని కూడా అంటుంది. మరొకవైపు ధరణి ని శైలంద్ర ఫోన్ లో నెంబర్ చూడమని చెప్పానని మహేంద్రతో వసుధార అంటుంది. అప్పుడే ధరణి ఫోన్ చేస్తుంది. నేను ఫోన్ తీసుకొని చూద్దామనుకున్న ఆలోపే ఆయనకు డౌట్ వచ్చింది.. నేను డైవర్ట్ చేసానంటూ జరిగిందంతా చెప్తుంది. సరే నేనే ఏదో ఒకటి చేసి కనుక్కుంటానని వసుధార చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.