English | Telugu

Guppedantha Manasu : పగటికలలు కంటున్న శైలేంద్ర.. ఆ పోస్టర్లు చూసేసిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1019 లో.. రాజీవ్ కాలేజీలో వసుధార, మనుల పోస్టర్లు అంటించడంతో వాడిని మహేంద్ర, అనుపమ చూసి షాక్ అవుతారు. ఇక మను, వసుధార ఇద్దరు రాగానే మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అంటు శైలంద్ర సైగ చేయగానే ఫాకల్టీ రెచ్చిపోయి మాట్లాడతారు. ఎవరు ఇదంతా చేశారని అనుపమ అడుగుతుంది. నాకేం తెలియదని మను అంటాడు.

ఆ తర్వాత రిషి సర్ పై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఇలా చేస్తారా అని ఫాకల్టీ అంత కలిసి వసుధారని అంటారు. మీరు ఒక ఎండీ పదవి లో ఉండి ఇలా చేస్తారని ఊహించలేదని కొందరు అంటారు. అసలు ఇదంతా మను గారే చేశారని ఫాకల్టీ అంటూ ఉంటే వసుధార కోపంగా మను దగ్గరికి వెళ్లి ఇంత నమ్మక ద్రోహం చేస్తారా అని మనుని కొడుతుంది. దాంతో అనుపమ బాధపడుతుంది. మీరు అసలు ఎండీ పదవి అర్హులు కాదు.. ఈ కాలేజీ పరువు ప్రతిష్టలు ఏం అవుతాయని అందరు అంటారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది.. దీన్ని కావాలనే ఎవరు చేస్తున్నారని మహేంద్ర అంటాడు. నేను ఇక ఎండీ పదవిలో ఉండను ఇంత అవమానం జరిగిన చోట అసలు ఉండను అంటు వసుధార వెళ్ళిపోతుంది. నీ సంగతి చెప్తానంటు శైలేంద్రకి మను వార్నింగ్ ఇస్తాడు.

ఆ తర్వాత ఎండీగా శైలేంద్ర గారు కరెక్ట్ అని బోర్డు మెంబర్స్ అందరు అంటారు. దాంతో ఎండీ పదవిలో శైలేంద్ర కూర్చోడానికి రెడీ అవుతాడు. పంతులు గారు ఎండీ చైర్ కి పూజ చేసి ఇక కూర్చోండి అని శైలంద్రకి చెప్పగానే.. నేను సాధించాను సాధించాను అంటూ గట్టిగా అరుస్తాడు. తీరా చూస్తే కార్ లో కాలేజీకి శైలేంద్ర, ధరణి వెళ్తుంటారు. శైలేంద్ర ఇదంతా ఉహించుకుంటాడు. మీరేం సాధించారంటు ధరణి అంటుంది. ఇక శైలేంద్ర ఓవర్ థింకింగ్ తో.. పూజారికి ఫోన్ చేసి కాలేజీకి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత అందరు కాలేజీలో పోస్టర్లు చూస్తుంటారు. అప్పుడే వసుధార వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.