English | Telugu

'బిగ్ బాస్ హౌస్‌లోకి రీఎంట్రీయా.. అంత సీన్ లేదు'! తేల్చేసిన గీతు!!

బిగ్ బాస్ సీజన్ 6లో గీతూ రాయల్ తన యాసతో మంచి గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఈమె బిగ్ బాస్ హౌస్‌లో టాప్ ఫైవ్‌లో ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ ఐపోయింది. ఐతే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఈమె సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే గీతూ బిగ్ బాస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపించాయి.

ఈ వార్తలపై గీతు స్పందించింది. తాను ఇక బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది. "రీఎంట్రీ ఇచ్చాక ఇలాగే మధ్యలో వెళ్లాల్సి వస్తే ఆ బాధ ఇంకా నేను తట్టుకోలేను కాబట్టి మళ్ళీ వెళ్ళను" అని చెప్పింది.బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు తన బాధ అంతా ఇంతా కాదని తెలిపింది.

ఎప్పుడైతే తన ఎలిమినేషన్ గురించి బిగ్ బాస్ చెప్పాడో ఆ క్షణం ఎంతో బాధేసిందని చెప్పింది. "నా లైఫ్ లో హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది నా ఎలిమినేషన్" అంది గీతూ. ఈ చిట్ చాట్‌లో భాగంగా "రేవంత్ హౌస్ లో ఉన్నప్పుడు మీతో పోట్లాడాడు, అయితే మీరు ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చాడు" అని అడిగేసరికి, "రేవంత్ నా దగ్గర మంచిగా మాట్లాడి పక్కకు వెళ్లేటప్పుడు బ్యాడ్‌గా మాట్లాడేవాడు. అయితే నేను ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం అతని ఏడుపు మాత్రం రియల్" అంటూ సమాధానమిచ్చింది. ఇక ఆదిరెడ్డి గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.