English | Telugu

Jayam serial : పోటీలో ఓడిపోయి‌న గంగ.. శకుంతల ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam l). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -167 లో.... గంగని ఎమోషనల్ గా చేసి ఓడించడానికి పారు, వీరు, ఇషిక ప్లాన్ చేస్తారు. గంగ పోటీలో గెలవడం చూడాలని రుద్ర ఇంటి నుండి బయల్దేరతాడు. రుద్ర వస్తున్న కార్ బ్రేక్ లు ఫెయిల్ అయ్యేలా చేస్తాడు వీరు. దాంతో రుద్ర ఒక దగ్గర కార్ ఆపుతాడు. అయిన తన వెంట రౌడీలు వచ్చి రుద్రపై ఎటాక్ చేస్తారు.

రుద్ర రౌడీలని కొట్టి అక్కడ నుండి తప్పించుకుంటాడు. అయినా రౌడీలు రుద్రని ఫాలో అవుతారు. మరొకవైపు మొదటి రౌండ్ లో గంగ గెలుస్తుంది. రుద్ర ఇంకా రాలేదని గంగ చుట్టూ చూస్తుంది. తన ఫ్రెండ్స్ తనకి సపోర్ట్ చేస్తారు. రుద్ర రావడం పారు చూసి అక్కడున్న అతనికి సైగ చెయ్యడంతో అతను వెళ్లి రుద్ర తలపై కొడుతాడు. రుద్ర కింద పడిపోతాడు. గంగ అని పిలుస్తాడు. దాంతో గంగ చూసి బయటకు వస్తుంటే వద్దని రుద్ర అంటాడు. అయిన వినకుండా గంగ వస్తుంది. దాంతో గంగ క్విట్ అవడం తో పారు విన్ అయిందని అనౌన్స్ చేస్తారు. దాంతో రుద్ర కోపంతో గంగ చెంపచెల్లుమనిపిస్తాడు. ఏం చెప్పాను.. వద్దు అన్నాను కదా.. ఎవరి ముందు అయితే నిన్ను విన్నర్ గా నిలబెదామనుకున్న కానీ నువ్వు ఇలా చేసావని కోప్పడుతాడు. నాకు మీ కంటే ఇది ముఖ్యం కాదు సర్ అని గంగ అంటుంది.

అ తర్వాత అందరు ఇంటికి వెళ్తారు. శకుంతల కోపంగా ఉంటుంది. రుద్రకి అలా అయిందని గంగ బయటకు వచ్చింది లేదంటే తనే విన్ అయ్యేది అని ఇంట్లో వాళ్లంతా గంగకి సపోర్ట్ గా మాట్లాడుతారు కానీ శకుంతల మాత్రం గంగని తప్పుపడుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.