English | Telugu

Eto Vellipoyindhi Manasu : లైవ్ లో భద్రం గురించి చెప్పిన సీతాకాంత్.. అది జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -309 లో..... ధన, సందీప్ లు చేసిన పనికి సీతాకాంత్ జనాలతో రాళ్ల దెబ్బలు పడ్డాడు. దాంతో పట్టరాని కోపంతో రామలక్ష్మిని తీసుకొని శ్రీలత ఇంటికి వెళ్తాడు సీతాకాంత్. బెల్ట్ తీసుకొని ధన, సందీప్ లని చితక్కొట్టుడు కొడుతాడు. నీకేం అధికారం ఉందని నా కొడుకు అల్లుడిని కొడుతున్నావని చెప్పి సీతాకాంత్ ని ఆపుతుంది శ్రీలత.

వాళ్లేం చేసారో తెలుసా అని సీతాకాంత్ అనగా.. ఏం చేసిన సరే వాళ్ళని కొట్టే అధికారం లేదు.. వాడు నా కొడుకు అని శ్రీలత అంటుంటే.. సీతాకాంత్ షాక్ అవుతాడు. మీరు ఆస్తులు బాగా చూసుకుంటారనే కదా మీకు రాసిచ్చింది. ఇప్పుడు కంపెనీకి నాకు బ్యాడ్ నేమ్ తీసుకొని వస్తుంటే ఎలా ఊరుకుంటానని సీతాకాంత్ అంటాడు. దాంతో సీతాకాంత్ బాధపడేలా శ్రీలత మాట్లాడేసరికి సీతాకాంత్ వెళ్లిపోతాడు. భద్రం మాత్రం సీతాకాంత్ ని జనాలు రాళ్లతో కొట్టిన వీడియో చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు సందీప్ కి శ్రీవల్లి దెబ్బలకి మందు రాస్తుంది. ధన దగ్గరికి సిరి వచ్చి మందు రాయాలా అని అడుగుతుంది. అప్పుడు ఇంకా కొట్టమని చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నావా అని ధన కోప్పడతాడు. మీరు నా డెలివరీ వరకు మారలేదో నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతానంటూ సిరి అందరికి జలక్ ఇస్తుంది. ఆ తర్వాత శ్రీలత ఒకతనికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. సీతాకాంత్ ఇంటికి వచ్చి కొట్టిన విషయం చెప్తుంది. వాడికి మూడు రోజుల టైమ్ ఉంది. ఈ లోపు భద్రం గాడు వాడి కంటపడకూడదు. సీతాకాంత్ రామలక్ష్మి గురించి తక్కువ అంచనా వెయ్యకని అతనితో శ్రీలత చెప్తుంది.

సీతాకాంత్ జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతుంటాడు. అది డైవర్ట్ చెయ్యడానికి రామలక్ష్మి ట్రై చేస్తుంది. మరుసటిరోజు ఉదయం అప్పుడే సన్నీ వచ్చి లైవ్ ప్రోగ్రాం చేద్దామని అంటుంది. వద్దని సీతాకాంత్ అనగానే.. చేద్దాం ఇలా లైవ్ లో భద్రం గురించి చెప్దామని రామలక్ష్మి అంటుంది. దాంతో సీతాకాంత్ సరే అంటాడు. లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీరు వ్యాపారం చెయ్యాలనుకుంటున్నారా.. మీకు ఇతను పెట్టుబడి పెడతాడంటూ భద్రం ఫోటో చూపిస్తాడు. అతన్ని కలిసి అతనితో సెల్ఫీ తీసుకొని నాకు పంపిస్తే మీకు అతను పెట్టుబడి పెట్టెలా.. నేను చేస్తానని అనౌన్స్ మెంట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.