English | Telugu

Eto Vellipoyindhi Manasu : నీకు అర్హత లేదు.. మీ నీడ పడకూడదంటూ అల్లుడు, కోడలిని తిట్టేసిన అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -109 లో.. అభి ఇంటికి మాణిక్యం వస్తాడు. అక్కడ ఇంటికి తాళం వేసి ఉంటుంది. అప్పుడే ఒకతను వచ్చి.. ఈ ఇంట్లో వాళ్ళు రాత్రికి రాత్రే ఎక్కడికో వెళ్లిపోయారని చెప్తాడు. ఈ విషయం మీ అల్లుడు చెప్పలేదా అతను కూడా ఇక్కడికి వచ్చాడని చెప్పగానే.. అల్లుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఏదో రహస్యం నడుస్తుందని మాణిక్యం అనుకుంటాడు.

ఆ తర్వాత రామలక్ష్మికి స్వామి ఇచ్చిన చీరను సీతాకాంత్ తీసుకొని వస్తాడు. రామలక్ష్మికి ఇస్తాడు. ఇప్పుడు ఇదెందుకు తెచ్చారనగానే.. స్వామి ఇచ్చాడు.. ఇక నీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు ప్రశాంతంగా ఉంటావ్.. ఇక అన్ని ఇబ్బందులు తొలగిపోయి.. హ్యాపీ గా ఉండాలని సీతాకాంత్ చెప్తాడు. అప్పుడే శ్రీలత వచ్చి.. నువ్వు మారిపోయావు.. ఇలా మారిపోతావనుకులేదని అనగానే.. నేనేం మారిపోయాను రామలక్ష్మికి చీర తెచ్చానని అంటున్నవా అని సీతాకాంత్ అడుగుతాడు. ఎందుకు అంటున్నానో రేపు ప్రొద్దున అర్థం అవుతుందని శ్రీలత చెప్పేసి వెళ్ళిపోతుంది. ఎందుకు అలా అంటుందని రామలక్ష్మి అంటుంది. రేపు ప్రొద్దున తెలుస్తుందని అమ్మ చెప్పింది కదా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ధన డల్ గా కూర్చొని ఉంటాడు. అప్పుడే సిరి వచ్చి.. నీ బిజినెస్ గురించి చెప్పట్లేదని అడుగుతుంది. నేను బిజినెస్ చెయ్యట్లేదు.. నాకు ఇంట్రెస్ట్ లేదని ధన అంటాడు. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. ఎందుకు ఇంట్రస్ట్ లేదు..‌ప్లాన్ ఇవ్వు.. ఫండ్స్ రిలీజ్ చేస్తానని చెప్పాను కదా అని సీతాకాంత్ అంటాడు. మీరు ఇచ్చేది నా ప్లానింగ్ కి సరిపోదని ధన అంటాడు. బిజినెస్ లో మొదటగా తక్కువ పెట్టుబడితో ఉండాలి.. లేదంటే నష్టం వచ్చే అవకాశం ఉందని ధనకి అర్థమయ్యేలా సీతాకాంత్ చెప్తాడు.

మరుసటి రోజు ఉదయం రామలక్ష్మిని డిస్టబ్ చెయ్యొద్దని సీతాకాంత్ అనుకుంటాడు. కానీ రామలక్ష్మి నిద్ర లేస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ తన తండ్రి ఫోటో దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత అందరు ఫోటో దగ్గరికి వస్తారు. నేను ఇంకా మీ నాన్న పుట్టినరోజు మర్చిపోయావని అనుకున్నానని శ్రీలత అనగానే.. అలా ఎలా మర్చిపోతాను.. నాన్నే నా జీవితమని సీతాకాంత్ చెప్తాడు. కాసేపటికి మీ మావయ్య ఫోటో దగ్గర దీపం పెట్టమని రామలక్ష్మికి పెద్దాయన చెప్తాడు. రామలక్ష్మి దీపం పెడుతుంటే శ్రీలత ఆపుతుంది. నీకు అర్హత లేదు.. మీ నాన్న వాళ్లే అతను చనిపోయాడు.. మీ నీడ కూడా పడడానికి వీలు లేదంటు రామలక్ష్మిని శ్రీలత తిడుతుంది. అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు పిలిచారని ధన అడుగుతాడు. బుద్ది లేక.. ఆ బుద్ది లేకే నువ్వు ఈ ఇంటికి అల్లుడివి అయ్యావని ధనని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.