English | Telugu

Eto Vellipoyindhi Manasu:ధన జ్ఞాపకాలతో చనిపోవాలనుకున్న సిరి.. గుండెపగిలే నిజం తెలుసుకున్న శ్రీలత!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -35 లో.. రామలక్ష్మి తన నాన్నని కాపాడుకోవడానికి మళ్ళీ వేరొక ఊరుకి సామాను సర్దుకొని బయలుదేర్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా బయపడుకుంటూ ఉండాలని రామలక్ష్మి వాళ్ళ అమ్మ సుజాత బాధపడుతుంది. ఆ సర్ మళ్ళీ వస్తారా అని పింకీ భయపడుకుంటూ.. నాన్నని ఏమైనా చేస్తారా అని ఏడుస్తుంది. లేదు నేను ఉన్నాను. నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటానని పింకీకి రామలక్ష్మి ధైర్యం చెప్తుంది.

ఆ తర్వాత నాకు తెలుసు అమ్మ నువ్వు మన కుటుంబానికి అండగా ఉంటావని అని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత మాణిక్యం ఆ సిచువేషన్ లో కూడా డ్రింక్ చేస్తూ ఓవర్ గా మాట్లాడుతుంటే రామలక్ష్మి, సుజాతలకి కోపం వస్తుంది. ఇప్పుడు నన్ను ఇలా తిరిగిస్తున్నారు కదా.. నేను కూడా వాళ్ళని తిరిగించే రోజు వస్తది.. అప్పుడు వాళ్ళ సంగతి చెప్తాను. ఏదో ఒక ఆయుధం ఖచ్చితంగా దొరుకుతుందని మాణిక్యం అనుకుంటాడు. మరొకవైపు శ్రీలత డాక్టర్ తో సిరి కండిషన్ గురించి మాట్లాడుతుంది. బానే ఉంది బ్లడ్ బాగా పోయింది.. అమ్మాయికి చూస్తే ఇంకా పెళ్లి కానట్టుంది. మీకు ఒక విషయం చెప్పాలని డాక్టర్ అనగా.. ఏంటని శ్రీలత అడుగుతుంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పగానే శ్రీలత షాక్ అవుతుంది. ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి అని డాక్టర్ కి శ్రీలత చెప్తుంది.

ఆ తర్వాత ఎందుకు ఇలా చేసావ్ అమ్మ.. ఈ అన్నయ్య గుర్తుకు రాలేదా అని సిరి దగ్గరికి వెళ్లిన సీతాకాంత్ అడుగుతాడు. ధనని మర్చిపోమని చెప్పావ్ కానీ నా వల్ల కాదు అందుకే అని సిరి అంటుంది. అప్పుడే శ్రీలత వస్తుంది. సీతాకాంత్ కి ఫోన్ రావడంతో బయటకు వెళ్తాడు. శ్రీలత తన మావయ్యని శ్రీవల్లిని బయటకు పంపించి.. సిరి ఒక్కదానితోనే మాట్లాడుతుంది. ఎందుకు ఇలా తప్పు చేసావ్? పెళ్లి కాకముందే తల్లి అవుతున్నావంటూ సిరిని శ్రీలత కొడుతుంది. దాంతో సిరి షాక్ అవుతుంది. నీ కడుపులో పెరుగతున్న బిడ్డని నేను చంపేస్తానని సిరితో శ్రీలత అంటుంది. నేను ఒప్పుకోనని సిరి అనగానే.. ఆ కడుపుకి కారణం అయిన వాన్ని చంపేస్తానని శ్రీలత కోపంగా మాట్లాడుతుంది. ఈ విషయం ఎవరికి చెప్పకని సిరికి శ్రీలత చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు రామలక్ష్మి వాళ్ళ వేరొక ఇంటికి చేరుకొని సామాను సర్దుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.