English | Telugu

నువ్వు నాకు సెట్ అవ్వవు..  నీలాంటి దురదృష్టం దగ్గర ఆగిపోమంటావా!

గత కొన్నిరోజులుగా ఈ ట్విస్ట్ కోసం ' ఎటో వెళ్ళిపోయింది మనసు' సీరియల్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సీరియల్ లో అభిని చూస్తే ప్రతీ ఒక్కరికి కోపం, ద్వేషం, బాధ, కలుగుతుంటాయి. ఎందుకంటే ఆ పాత్ర అలా ఉంది. ఈ సీరియల్ లో అసలు ఏం అయిందో ఓసారి చూద్దాం.

ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ‌ప్రోమో రిలీజ్ అవుతే చాలు.. గంటలోపే వేలల్లో వ్యూస్ వస్తాయి. అంతలా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ లో రక్ష నింబార్గి, సీతాకాంత్ ల ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ కి ఆడియన్స్ ఫిధా అయ్యారనే చెప్పాలి. రోజుకో ట్విస్ట్ తో సాగే ఈ సీరియల్ లో మాణిక్యం, సిరి, ధన, శ్రీలత, సందీప్, అభి, రామలక్ష్మి, సీతాకాంత్ ఇలా అందరు తమ పాత్రలకి న్యాయం చేస్తున్నారు. గత జన్మలో ప్రేమించుకొని విడిపోయిన రామలక్ష్మి, సీతాకాంత్.. ఈ జన్నలోనైనా కలుస్తారా లేదా అనే కథాంశంతో మొదలైన ఈ కథ.. మొదటి ఎపిసోడ్ నుండి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అందులోను ఇద్దరి భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు.. అయితే రామలక్ష్మికి ముందుగానే అభి అనే బాయ్ ఫ్రెండ్ ఉండటంతో కథలో మెలిక మొదలైంది. అభి వాళ్ళింటికి సీతాకాంత్ వెళ్ళి అక్కడ అన్నీ విషయాలు తెలుసుకుంటాడు.

అభికి సీతాకాంత్ గుణపాఠం చెప్పి.. తను ఇచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ ని తీసుకుంటాడు. ఇక రామలక్ష్మిని కలిసి తను చెప్పినట్టు చేయమంటాడు సీతాకాంత్. ‌ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో ‌రామలక్ష్మిని అభి కలుస్తాడు. నువ్వు నాకు సెట్ అవ్వవు.. నా స్థాయికి నువ్వు సరిపోవు. ఏవిధంగాను నువ్వు నాకు మ్యాచ్ అవ్వవు అని రామలక్ష్మితో అభి అంటాడు. అభి నువ్వేనా ఇలా మాట్లాడేది? నీ స్థాయికి నేను మ్యాచ్ అవ్వనా అని రామలక్ష్మి ఎమోషనల్ గా అడుగుతుంది. అవును..‌అవును అని అభి అంటాడు. చిటికేస్తే కోట్లలో కట్నం ఇచ్చే అమ్మాయిలు రెడీగా ఉంటారు. వెతుక్కుంటూ వస్తున్న అదృష్టాన్ని కాలదన్నుకొని నీలాంటి దురదృష్టం దగ్గర ఆగిపోమంటావా అని రామలక్ష్మితో అభి అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్, రామలక్ష్మిని కలిసి.. అభి మాట్లాడంటే నేను నమ్మలేకపోతున్నాను.. పదా అభికి అలా మాట్లాడటం తప్పు అని చెప్తా అని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. అలాంటివాడికి చెప్తే మారతాడని అనుకోవడమంత పిచ్చితనం మరొకటి ఉండదు సర్ అని రామలక్ష్మి అంటుంది. దాంతో‌ సీతాకాంత్ ఆశ్చర్యంగా చూస్తాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.