English | Telugu

డాన్స్ ఐకాన్ సీజన్ 2 విన్నర్.. క్యాష్ ప్రైజ్ ఎంతంటే..?

డాన్స్ ఐకాన్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే చాలా ధూమ్ ధామ్ గా జరిగింది. ఈ ఎపిసోడ్ కి సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా వచ్చాడు. అలాగే "వచ్చినవాడు గౌతమ్" మూవీ టీమ్ నుంచి అశ్విన్ కూడా ఈ షోకి వచ్చాడు. ఈ మూవీ టీజర్ కూడా ఈ షోలో రిలీజ్ చేశారు. ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్ లో విన్నర్ ని తప్పించి మిగతా ఓడిపోయిన వాళ్ళను జడ్జెస్ రమ్యకృష్ణ, శేఖర్ మాష్టర్, ఫారియా వచ్చి ఒక్కొక్కరినీ బయటకు తీసుకెళ్ళిపోగా ఫైనల్ గా యష్ మాష్టర్ - బినితా మాత్రమే మిగిలారు. వీళ్ళు టైటిల్ ని సొంతం చేసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ వీళ్లకు ట్రోఫీని అందించారు.

బినితా 8,58,771 ఓట్స్ తో ఫస్ట్ ప్లేస్ ని సొంతం చేసుకుంది. ఇక సెకండ్ ప్లేస్ లో ప్రాకృతి-బర్కత్ టీమ్ 6,81,278 ఓట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఐతే బర్కత్ ఈ ఎపిసోడ్ రాలేకపోయింది. అలాగే అన్ని ఎపిసోడ్స్ లో బినితాకి డాన్స్ కొరియోగ్రాఫ్ చేసిన కృష్ణని యష్ మాష్టర్ స్టేజి మీదకు పిలిచాడు. ఆ ట్రోఫీ పట్టుకుని కృష్ణ ఎంతో ఆనందం వ్యక్తం చేసాడు. సీజన్ 1 లో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాను. ఎలాగైనా ఫస్ట్ ప్లేస్ కి రావాలి అనుకున్నాను అలాగే బినిత దొరికింది చాల హార్డ్ వర్క్ చేసింది ఎంతో సపోర్ట్ చేసింది అని చెప్పాడు కృష్ణ. అలాగే బినితాకి 5 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా అందించారు.

అలాగే "వచ్చినవాడు గౌతమ్" మూవీ ప్రొడ్యూసర్ కి బినిత అంటే చాలా ఇష్టం అని అందుకే మూవీ టీమ్ తరపున మరో 5 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా అందించారు. అలాగే సాయి ధరమ్ తేజ్ చిన్నపిల్లలైన బర్కత్ , బినితా కోసం రెండు టెడ్డి బేర్స్ ని తెచ్చి ప్రెజెంట్ చేశారు. ఇలా ఈ సీజన్ ఇక్కడితో ఎండ్ ఐపోయింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.