English | Telugu

మురారిని సస్పెన్షన్ చేసినందుకు సారీ చెప్పిన కమీషనర్.!

'కృష్ణ ముకుంద మురారి' ఇప్పుడు స్టార్ మా టీవి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ధారావాహిక. ఈ సీరియల్ ఎపిసోడ్‌-49లో కృష్ణతో మాట్లాడటానికి వాళ్ళ అత్తయ్య రేవతి వస్తుంది. "నిన్ను ఒక విషయం అడగాలి కృష్ణ.. మురారిని ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసా? నీ మూలంగా నీ భర్త ఉద్యోగం పోయేలా ఉన్నా నీకు బాధ లేదా? అందరూ బాధపడుతున్నారు. మరి నువ్వు ఎందుకమ్మా ఇలా ఉన్నావ్? మా అందరికన్నా ఎక్కువ ఓదార్పు నీ దగ్గర నుండే కోరుకుంటాడు కదమ్మా. అలాంటిది నువ్వు ఏమీ పట్టనట్టు ఎందుకు ఉన్నావ్? మురారి నిన్ను బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడని, వాడెవడో శివన్న కంప్లెంట్ చేయడం ఏంటి. దానికి మీ ఊరివాళ్ళంతా సాక్షులుగా నిలబడం ఏంటి. నిన్ను నిలదీయాలని కాదమ్మ.. నాకు చెప్పాలనిపించింది చెప్పాను. సమాధానం నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు " అని కృష్ణని అడుగుతుంది రేవతి. కృష్ణ మౌనంగా ఉండిపోతుంది. కాసేపటికి కృష్ణ బయటకు వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా కృష్ణ ఇంట్లో లేదనే విషయం తెలుసుకుంటారు. ఎక్కడికి వెళ్ళిందని, కృష్ణ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో కమీషనర్ తో పాటు కృష్ణ వస్తుంది. భవానీతో "కృష్ణవేణి నా దగ్గరకి వచ్చి జరిగిందంతా చెప్పింది. మురారి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. మేం నిజమేంటో తెలుసుకోకుండా సస్పెండ్ చేశాం. మీ కుటుంబం మొత్తానికి సారీ చెప్తున్నాను" అని చెప్పేసి వెళ్తాడు కమీషనర్.

"కృష్ణ.. మురారి కోసం ఇంత ధైర్యం చేసినందుకు, కేసు లేకుండా చేసినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఇంకోసారి బయటకు వెళ్ళేటప్పుడు అక్కతో చెప్పి వెళ్ళు.. సరేనా" అని రేవతి అంటుంది. "సరే అత్తయ్య.. బాగా ఆకలేస్తుంది. పొద్దున్నుండి టిఫిన్ కూడా చేయలేదు" అని కృష్ణ అంటుంది. "అయ్యో.. సరే పదమ్మ టిఫిన్ పెడతాను" అని రేవతి అంటుంది. "భర్తకి వచ్చిన సమస్య తీర్చడం భార్య బాధ్యత అది సవ్యంగా చేసింది" అని భవాని అంటుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.