English | Telugu

కావ్యకి స్వేచ్చనివ్వాలని చెప్పిన సీతారామయ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -182 లో.. కావ్య తనేం తప్పు చేయలేదని చెప్పడానికి రాజ్ దగ్గరికి వెళ్ళగానే.. రాజ్ కోపంగా చెయ్యిని గోడకేసి కొడుతాడు. కావ్య రాజ్ దగ్గరికి వెళ్తే రాజ్ రానివ్వడు. మరొక వైపు అపర్ణ గది దగ్గరికి కావ్య వెళ్తుంది. అత్తయ్య లోపలికి రావచ్చా అని అడుగుతుంది. వద్దని అపర్ణ అంటుంది‌ ఎందుకు వచ్చావ్ అని అపర్ణ అడుగుతుంది.

ఆ తర్వాత మీ అవధార్యo కావాలని కావ్య అడుగుతుంది. మీరు పెద్దవారు మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే చిన్న పిల్లలని క్షమించలేరా అని కావ్య అడుగుతుంది. క్షమించలేను.. ఎందుకు అంటే అసలు నిన్ను ఈ ఇంటి మనిషిగా కూడా చూడట్లేదని, నువ్వు గాలికి కొట్టుకొచ్చిన ఒక ధూళివని అపర్ణ అనగానే.. ఆ ధూళి అయిన కూడా ఎంత పెద్దగాలి వచ్చిన ఒక్కోసారి కదలదని కావ్య కౌంటర్ వేస్తుంది. కావ్య ఇలా అపర్ణకి కౌంటర్ వేయడంతో అపర్ణ ఇంకా కోపం పెంచుకుంటుంది..

ఆ తర్వాత కావ్య దేవుని దగ్గరకి వెళ్లి.. తన బాధని చెప్పుకుంటుంది. కాసేపటికి రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి.. మా పుట్టింటి వాళ్లకి సాయం చేస్తానని మాట ఇచ్చాను కదా.. నేను వెళ్ళన అని రాజ్ ని కావ్య అడుగుతుంది. కానీ రాజ్ పట్టించుకోకుండా వెళ్తాడు. కావ్య ఇంట్లో పెద్ద వాళ్ళయిన సీతరామయ్య ఇందిరాదేవిలకి చెప్పి వెళ్దాం అనుకొని హాల్లో కూర్చొని ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి మా పుట్టింటికి వెళ్ళనా అని పర్మిషన్ అడుగుతుంది. మా పెద్దరికం.. ఈ ఇంట్లో మాకు ఎక్కడ ఉంచారని సీతారామయ్య అంటాడు. అపర్ణ వాళ్ళ మాటకి విలువ ఇవ్వలేదని సీతారామయ్య ఇండైరెక్ట్ గా కావ్యతో అంటాడు. ఈ ఇంటి కోడలిని అమానుషంగా బయట నిల్చొపెట్టారని ఇందిరాదేవి అంటుంది. ఆ పని చేసింది నేను కాదు రాజ్ అని అపర్ణ అంటుంది. రాజ్ తనకి నచ్చని పని చేస్తుందని అలా చెయ్యలేదు తన తల్లికి కావ్య ఎదురు చెప్పిందని రాజ్ ఆలా చేసాడు. అయిన నువ్వు రాజ్ ని ఎందుకు ఆపలేదని ఇందిరాదేవి అంటుంది.

ఆ తర్వాత ఒక అమ్మాయికి నచ్చిన పని చేసుకునే స్వేచ్ఛ లేదా? ఎందుకు ఇలా అడ్డు చెప్తున్నారు.. కావ్య వెళ్లడం ఎవరికి ఇష్టం లేదో చెప్పండని సీతరామయ్య అడుగుతాడు. అందరూ మౌనంగా ఉంటారు. మీ మౌనం అంగీకారమని భావిస్తున్నాను.. కావ్య నువ్వు వెళ్ళు ఇక్కడ నిన్ను ఆపే వారు ఎవరు లేరని సీతారామయ్య చెప్తాడు. ఇద్దరు కలిసి కావ్యని తన పుట్టింటికి పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.