English | Telugu

Brahmamudi : కావ్యకి అబార్షన్ చేయమన్న రాజ్.. తను చూసేసిందిగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -833లో.....రాజ్ హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ ఒకతను తన భార్యకి అబార్షన్ చేయిస్తున్నాడని తెలిసి అతనితో గొడవపడతాడు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బయటకు తీసుకొని వెళ్తాడు. ఏంటి అన్నయ్య అందరితో గొడవ పెట్టుకుంటూ వెళ్తే ఎలా కనీసం వదినని అయిన బ్రతికించే ప్రయత్నం చెయ్ అని కళ్యాణ్ అంటాడు.

ఆ తర్వాత రాజ్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో రుద్రాణి ఆలోచిస్తుంది. అప్పుడే రాహుల్ వస్తాడు. మమ్మీ మనకి ఇదే కరెక్ట్ టైం.. రాజ్ తో కంపెనీ బాధ్యతలు నాకు ఇవ్వమని చెప్తానని అంటాడు. అప్పుడే రాజ్, కళ్యాణ్ ఇంటికి వస్తారు.రాజ్ దగ్గరికి రాహుల్ వచ్చి కంపెనీ గురించి మాట్లాడాలి.. కొన్ని రోజులు ఆఫీస్ ను నేను చూసుకుంటానని రాహుల్ అంటాడు. వద్దు నీకు ఆ సామర్థ్యం లేదని అంటాడు. అప్పుడే రుద్రాణి వచ్చి నా కొడుకు కి ఆఫీస్ బాధ్యతలు చూసుకునేంత సామర్ధ్యం ఉందని రుద్రాణి అంటుంటే వాడు కంపెనీ బాధ్యతలు చూసుకోవడానికి పనికి రాడాని రాజ్ చెప్తాడు. అప్పుడే ఇందిరాదేవి వచ్చి ఎప్పుడెలా మాట్లాడాలో తెలియదని రుద్రాణిపై కోప్పడుతుంది.

ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. తను నిద్రపోతుంది తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో రాజ్ మాట్లాడుతాడు. అప్పుడే కావ్య లేస్తుంది. ఏంటి మీ బిడ్డని సరిగ్గా చూసుకుంటున్నానో లేదో తెలుసుకుంటున్నారా అని కావ్య అంటుంది. తరువాయి భాగంలో కావ్యకి తెలియకుండా మీరు అబార్షన్ చెయ్యండి. తను ఒప్పుకోదని డాక్టర్ ని రాజ్ రిక్వెస్ట్ చేస్తుంటే కావ్య చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.