English | Telugu

Brahmamudi : రుద్రాణి పెట్టిన చిచ్చు.... కావ్యకి శిక్ష తప్పేలా లేదు!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి''(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -820 లో....దుగ్గిరాల ఇంట్లో వినాయకుడి పూజకి ఏర్పాట్లు చేస్తారు. రేవతి ఇంటిముందుకు వచ్చి రాజ్ కి కాల్ చేస్తుంది. దాంతో కావ్యని తీసుకొని రాజ్ బయటకు వెళ్తాడు. రేవతి ముసుగు వేసుకొని ఉంటుంది. కావ్యని ఆటపట్టింద్దామని.. తను నా క్లాస్ మేట్ అని రాజ్ చెప్పగానే మొన్నటి వరకు యామిని ఇప్పుడు తనా అని ముసుగులో ఉన్న రేవతిని తిడుతుంది కావ్య.

ముసుగు తీసి చూస్తే రేవతి ఉంటుంది. తను చూసి సారీ వదిన అని కావ్య అంటుంది. దాంతో రాజ్ నవ్వుతాడు. రేవతి ఇంట్లోకి రావడానికి బయపడుతుంది కానీ తీసుకొని వస్తారు. స్వరాజ్ లోపలికి పరిగెత్తుకొని వెళ్తాడు. అతన్ని చూసి అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్వరాజ్ వాళ్ళ అమ్మ గారు అని రేవతిని ఇంట్లో అందరికి పరిచయం చేస్తాడు రాజ్. ముసుగు ఎంటి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. వాళ్ళ ఆచారం పిన్ని అని రాజ్ కవర్ చేస్తాడు. నేను ఎక్కడ ఇలాంటి ఆచారాలు చూడలేదు అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత పూజ మొదలవుతుంది. సీతారామయ్య దగ్గరికి రేవతిని తీసుకొని కావ్య, రాజ్ వెళ్తారు.

రేవతితో సీతారామయ్య మాట్లాడుతుంటే అప్పుడే ఇందిరాదేవి వచ్చి మీరేం చేస్తున్నారు.. ఈ అమ్మాయి ఎవరు.. స్వరాజ్ వాళ్ళ అమ్మనా అని అడుగుతుంది. మీ మనవరాలు రేవతి అని కావ్య అంటుంది. రేవతిని చూసి ఇందిరాదేవి టెన్షన్ పడుతుంది. ఈ విషయం అపర్ణకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటుంది. అక్కని మేమ్ ఈ కుటుంబానికి దగ్గర చేస్తామని రాజ్ అనగానే మేమ్ కూడా అని అప్పు, కళ్యాణ్, స్వప్న అంటారు. తరువాయి భాగంలో ఈ స్వరాజ్ ఎవరో కాదు ఈ ఇంటికి వారసుడు రేవతి కొడుకు అని ఇంట్లో అందరి ముందు రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.