English | Telugu

Brahmamudi : కావ్యకి  దూరంగా రాజ్.... అతని ప్రయాణాన్ని ఆపగలదా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -803 లో......అక్క చెల్లెళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అది చూసి అక్కచెల్లెళ్ళు అంత హ్యాపీగా ఉండడం ఏంటని రుద్రాణి అనుకుంటుంది. స్వరాజ్ దగ్గరికి వెళ్లి.. బాబూ నీకు ఆ ఆంటి చాక్లెట్ ఇచ్చింది కదా.. ఇప్పుడు తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కంగ్రాట్స్ చెప్పావా అని రుద్రాణి అనగానే.. ఓహ్ ఎందుకు చెప్పను చెప్తానంటూ కావ్య దగ్గరికి వెళ్తాడు. ఆంటి కంగ్రాట్స్ మీరు ప్రెగ్నెంట్ అంట కదా అని అనగానే అందరు షాక్ అవుతారు.

నీకెవరు చెప్పారని ఇందిరాదేవి అడుగుతుంది. వెంటనే స్వరాజ్ రుద్రాణి పేరు చెప్తాడు. నీకు కొంచెం అయినా బుద్ధి ఉందా చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ రుద్రాణిపై ఇందిరాదేవి విరుచుకుపడుతుంది. అటు తిప్పి ఇటు తిప్పి నన్ను అంటున్నారని రుద్రాణి అనుకొని.... నేను అప్పుని చూపించాను వాడికి కావ్య అని అర్థమైంది.. నేనేం చెయ్యాలని రుద్రాణి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు కలిసి కనకాన్ని బయటకు తీసుకొని వచ్చి పూజ తర్వాత కావ్యని రాజ్ ఆశీర్వాదించేలా ఏమైనా ప్లాన్ చేసావా అని అడుగుతారు. అదంతా నేను చూసుకుంటానని కనకం హామీ ఇస్తుంది. ఆ తర్వాత పూజ జరుగుతుంది. రాహుల్ దగ్గర స్వప్న ఆశీర్వాదం తీసుకోగా.. కళ్యాణ్ దగ్గర అప్పు ఆశీర్వాదం తీసుకుంటుంది. అప్పుకి ఏంటి ఏం కావడం లేదు.. నువ్వు అసలు టాబ్లెట్ మార్చావా లేదా అని రాహుల్ ని అడుగుతుంది రుద్రాణి. మార్చాను మమ్మీ అని రాహుల్ చెప్తాడు.

ఆ తర్వాత కనకం దగ్గర కావ్య ఆశీర్వాదం తీసుకుంటుంది. పక్కనే రాజ్ ఉండడంతో తన చేతిలోని అక్షింతలు కావ్యపై పడేలా కనకం చేస్తుంది. రాజ్ ఆశీర్వాదించాడని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కావ్యని రాజ్ పక్కకి తీసుకొని వెళ్లి తన మనసులో మాట చెప్తాడు. ఎందుకు మీరు నన్ను వద్దని అంటున్నారని అడుగుతాడు. తరువాయి భాగంలో రాజ్ అమెరికా వెళ్తున్నాడని రుద్రాణి ఇంట్లో వాళ్లకు చెప్తుంది. ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి.. థాంక్స్ కావ్య.. నీ వల్లే మా బావ అమెరికా వెళ్తున్నాడని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.