English | Telugu

భర్తకు విడాకులు ఇస్తున్న బ్రహ్మముడి కావ్య...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -358 లో.. మీరు అప్పుని కలిసి మాట్లడడం వల్ల మీ వాళ్ళు నా పుట్టింటి వాళ్ళని తిడుతున్నారని, మీరు తనని కలిసి వాళ్ళని మాటలు అనేలా చేస్తున్నారని కళ్యాణ్ ని కావ్య అనగానే.. మీరు కూడ అంటున్నారా అని కళ్యాణ్ షాక్ అవుతాడు.

మీరు ఇక అప్పుని కలవడం మానెయ్యండి అని కావ్య చెప్పగానే.. వాళ్ళేదో అన్నారని నేను మానేస్తే వాళ్ళు అన్నదే నిజం అవుతుందని కళ్యాణ్ అంటాడు. నేను అప్పుతో మాట్లాడుతానని కళ్యాణ్ చెప్తాడు. ఆ తర్వాత రాజ్ ని కావ్య తీసుకొని వెళ్తుంది. అప్పుడు రాజ్ బీరువా నుండి డబ్బులు తీసి కావ్యకి ఇస్తాడు. ఎందుకు ఇంత డబ్బు అని కావ్య అడుగుతుంది. డిజైన్స్ వేసావ్ కదా అందుకే అని రాజ్ అంటాడు. సాలరీ ఇస్తున్నారు కదా అని కావ్య అనగానే.. అంటే పాస్ పోర్ట్ వచ్చింది కదా.. అమెరికా వెళ్తావ్ కదా.. ఖర్చులు ఉంటాయి కదా అని ఇసున్నానని రాజ్ అనగానే కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత రాజ్ వెళ్ళిపోయాక కావ్య దగ్గరికి ఇందిరాదేవి , భాస్కర్ లు వస్తారు. వాళ్లకి రాజ్ డబ్బులు ఇచ్చిన విషయం కావ్య చెప్తుంది. ఇందిరాదేవి డైవర్స్ పేపర్స్ కావ్యకి ఇచ్చి సంతకం చేసి రాజ్ కి ఇచ్చి తనని చెయ్యమని చెప్తుంది. రాజ్ ఎలా తన ప్రేమని బయటపెట్టడో చూద్దామని ఇందిరాదేవి అంటుంది. కావ్యకి ఇష్టం లేకున్నా ఇందిరాదేవి కావ్యని ఒప్పిస్తుంది.

ఆ తర్వాత కావ్య దేవుడి దగ్గరికి వెళ్లి మొక్కుతు తన బాధని చెప్పుకుంటుంది. బాధపడుతూ విడాకుల పత్రంపై కావ్య సంతకం చేస్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి ఆ పత్రాలు తీసుకొని వెళ్లి ఈ విడాకుల పత్రాలపై సంతకం చెయ్యండి అనగానే.. రాజ్ షాక్ అవుతాడు. మీరు నన్ను వదిలేసి శ్వేతని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు కదా అందుకే మిమ్మల్ని బాధపెట్టలేను అందుకే విడాకులు ఇస్తున్నానని కావ్య చెప్తుంది. తరువాయి భాగంలో కావ్యపై నీకున్న ప్రేమని ఆమె బయటకు వెళ్లకముందే చెప్పు అని రాజ్ కి శ్వేత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.