English | Telugu

Brahmamudi: పుట్టింటికి వచ్చేసిన కావ్య.. కారణం తెలుసుకొని కనకం షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -849 లో.... కావ్య తన పుట్టింటికి వస్తుంది. ఎందుకు ఇంత సడెన్ గా వచ్చావని కనకం ఆరా తియ్యడంతో కావ్య చిరాకుగా.. ఒక అమ్మాయి ఇలా పుట్టింటికి వచ్చే స్వేచ్ఛ కూడా లేదా అని అంటుంది. అసలు కావ్య వాళ్ళ అత్తింట్లో ఏం జరిగిందో కనుక్కుందామని అపర్ణకి కనకం ఫోన్ చేస్తుంటే.. కావ్య వచ్చి లాక్కొని ఎవరికి ఫోన్ చెయ్యాల్సిన అవసరం లేదు.. ఆకలి అవుతుంది ముందు భోజనం పెట్టమని కావ్య అంటుంది.

మరొకవైపు కావ్య తన పుట్టింటికి వెళ్ళిందేమోనని కనకంకి అపర్ణ ఫోన్ చేస్తుంది. ఏంటి ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని అపర్ణ అనగానే.. ఇంకేముంది అసలు కావ్య అక్కడికి వెళ్లి ఉండదు.. వెళ్తే అసలు ఏమైందని ఆ కనకం ఫోన్ చేసేది కదా అని రుద్రాణి అంటుంది. మరొకవైపు అసలు అక్క ఎక్కడికి వెళ్ళిందని కావ్య ఫోటో పట్టుకొని అప్పు ఏడుస్తుంది.

ఆ తర్వాత కావ్య భోజనం చేస్తుంటే రాజ్ తన దగ్గరికి వచ్చి ఇంటికి వెళదామని అడుగుతాడు. మీ నిర్ణయం మార్చుకోండి లేదా ఆ నిర్ణయానికి గల కారణం అయినా చెప్పండి అని కావ్య అంటుంది. వస్తే రా.. లేకపోతే లేదని రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. అసలేం జరిగిందని కనకం అడుగుతున్నా కూడా కావ్య సైలెంట్ గా ఉంటుంది. మరొకవైపు మీ అక్క మీ ఇంట్లోనే ఉందట అని అప్పుతో కళ్యాణ్ చెప్పగానే అప్పు హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత రాజ్ ఇంటికి వస్తాడు. కావ్య గురించి ఏమైనా తెలిసిందా అని అపర్ణ అడుగుతుంది. వాళ్ళింట్లో ఉంది రమ్మంటే రానంది అని రాజ్ చెప్తాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు.. నా కోడలు నా ఇంట్లో ఉండాలని అపర్ణ అంటుంది. రానంటుంది నేనేం చెయ్యాలని చెప్పి రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. మరొకవైపు స్వప్నకి కనకం ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది.

తరువాయి భాగంలో కావ్య దగ్గరికి ఇందిరాదేవి, అపర్ణ వస్తారు. నీ యాక్టింగ్ సూపర్ అంటారు. యాక్టింగ్ కాదు నేను నిజంగానే ఇంట్లో నుండి వచ్చేసానని కావ్య అనగానే అపర్ణ, ఇందిరాదేవి షాక్ అవుతారు. అసలు ఏమైందని కనకం అడుగుతుంది. కావ్యని రాజ్ అబార్షన్ చేసుకొమ్మంటున్నాడని అపర్ణ చెప్పగానే కనకం షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.