English | Telugu

ఆ మాయ లేడి నుంచి కాపాడమని భార్యని వేడుకున్న భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -431 లో.... రాజ్ ఇచ్చిన వార్నింగ్ కు మాయ బయపడి బట్టలు సర్దుకుంటుంది. అప్పుడే రుద్రాణి రాహుల్ లు వస్తారు. వెళ్లిపోతున్నా అని మాయ అనగానే "నాకు తెలుసు.. చివరి నిమిషంలో ఇలా హ్యాండ్ ఇస్తావని నాకు తెలుసు.. నిన్ను ఎలా వెళ్ళనిస్తాం" అని రాహుల్ అంటాడు. నువ్వేం చేస్తావ్ .. ఏం చెయ్యలేవు ఎక్సట్రా మాట్లాడితే నన్ను తీసుకొని వచ్చి ఇదంతా చేస్తున్నారని చెప్తానని రాహుల్, రుద్రాణిలని మాయ బెదిరిస్తుంది.

మరొకవైపు రాజ్ నిద్రలేచి బయటకు వస్తాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే ఆ మాయ నేను ఇచ్చిన వార్నింగ్ కి భయపడి వెళ్ళిపోయి ఉంటుందని బయటకు వస్తాడు. తీరా చుస్తే మాయ తులసి చెట్టుకి పూజ చేస్తుంటుంది. తను ఇంకా వెళ్ళిపోలేదా.. నీ సంగతి చెప్తానంటూ రాజ్ వెళ్తుంటే అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. రాజ్ కి కావ్య గొప్పతనం గురించి చెప్తుంది. ఆ తర్వాత రాజ్ మాయ దగ్గరికి వెళ్తాడు. త్వరగా లేచారు ఈ రోజు మన పెళ్లి కదా అని మాయ అంటుంది. అలా మాయ అనగానే నిన్ను వెళ్లి పొమ్మని చెప్పాను కదా అని రాజ్ అడుగుతాడు. వెళ్ళిపోదామనే అనుకున్న కానీ ఇంత ఆస్తిని వదిలిపెట్టి ఎలా వెళ్ళగలనని మాయ అంటుంది. నువ్వేం చెయ్యలేవని మాయ అంటుంది. మీ నాన్న సంగతి నేను చూస్తానని రాజ్ అనగానే.. మాయ వాళ్ల నాన్న కి ఫోన్ చేసి నాన్న ఎక్కడున్నావని అడుగుతుంది. నువ్వే కదమ్మా రాత్రికి రాత్రి మలేషియా పంపించావని తన నాన్న చెప్తాడు. అదంతా స్పీకర్ పెట్టి రాజ్ కి వినిపిస్తుంది. నువ్వు ఇప్పుడేం చెయ్యలేవని మాయ అంటుంది. ఆ తర్వాత మాయ, రాజ్ లని అపర్ణ పిలిచి పెళ్లి బట్టలు ఇస్తుంది. మరొకవైపు ప్రకాష్ దగ్గరికి ధాన్యలక్ష్మి వస్తుంది. ఇంకా రెడీ అవ్వలేదా.. వాళ్లే నిర్ణయం తీసుకున్నారు.. వాళ్ళకి లేని బాధ మీకెందుకని అంటుంది.

కాసేపటికి రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. నేను ఎవరిని హెల్ప్ అడగలేదు. నిన్ను అడుగుతున్నాను. ఈ ప్రాబ్లమ్ నుండి బయట పడేయమని రాజ్ అనగానే.. మీరేం టెన్షన్ పడకండి నేను ఉన్నానని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్యకి అప్పు ఫోన్ చేసి డాక్టర్ మాట్లాడాలట నీతో అని చెప్తుంది. డాక్టర్ కావ్యతో మాట్లాడుతుంది. ఒక ఇంజక్షన్ వేస్తే స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెప్పగానే.. ఆ పని చెయ్యండి ఆ మాయ స్పృహలోకి రావడం చాలా అవసరమని కావ్య అంటుంది. దానికి డాక్టర్ సరే అంటుంది. తరువాయి భాగంలో పెళ్లిపీటలపై మాయ, రాజ్ లు కూర్చొని ఉంటారు. ఆ తర్వాత అసలు మాయ స్పృహ లోకి వచ్చిందని అప్పు ఫోన్ చేయగానే కావ్య బయల్దేరి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.