English | Telugu

Brahmamudi : ఆ బాబు గురించి చెప్పమన్న కోడలు.. కుదరదన్న మామయ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -389 లో....బాబుని తన తల్లికి అప్పగించు.. లేదంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బాబు కోసం నీ హోదా, అధికారం అంతా కోల్పోయావ్.. ఇప్పుడు ఈ ఇంటిని, అమ్మని ఇంటితో ఉన్న అన్ని బంధాల్ని వదిలేసి శాశ్వతంగా ఇంటి నుండి వెళ్ళిపోవాలని అపర్ణ అంటుంది.

అలా అంటున్నావేంటని ధాన్యలక్ష్మి అంటుంది. అలా అని కన్నకొడుకుని వదిలేస్తావా అని సుభాష్ అంటాడు. వాడే ఈ అమ్మని వదులుకోవాలని అనుకుంటున్నాడని అపర్ణ అంటుంది. ఏంటి అపర్ణ.. కన్నతల్లివి కసాయిదానిలాగా ప్రవర్తిస్తున్నావ్? అన్ని దూరం చేసావ్.. ఇప్పుడు ఇలా వాన్ని ఇంటికి దూరం చేస్తావా అని ఇందిరాదేవి కోప్పడుతుంది. మరి నిజం చెప్పడం లేదు కదా.. ఇప్పుడు ఆ బాబుకి ఏమైనా అయితే మనం సమాధానం చెప్పాలి. అయినా నోరు విప్పడం లేదని ఇందిరాదేవితో అపర్ణ అంటుంది. రాహుల్ లాంటి వాన్ని క్షమించారు.. అసలు ఏ తప్పు చెయ్యని రాజ్ కి శిక్ష ఎందుకు? ఇప్పుడు నిర్ణయం తీసుకోకండి.. కొంచెం టైమ్ ఇవ్వండి అని స్వప్న అనగానే.. సరే ఈ వారం రోజులు టైమ్ ఇస్తున్నాను. ఆ తర్వాత నిజం చెప్పకుంటే రాజ్ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని అపర్ణ చెప్తుంది. మరొకవైపు రాజ్ ఇంటినుండి వెళ్ళిపోతున్నాడని రాహుల్, రుద్రాణి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నావని అపర్ణని ఇందిరాదేవి అడుగుతుంది. ఇదంతా నీవల్లే ఆ రోజు నువ్వు వాడికి భోజనం పెట్టకుండా ఉంటే బాగుండని కావ్యని అపర్ణ అంటుంది. మరి నిజం ఎలా తెలుస్తుందని కావ్య అంటుంది. ఇప్పుడు వాడికి తల్లి కావాలో అజ్ఞానతంలో పుట్టిన బిడ్డ కావాలో వాడే తేల్చుకోవాలని ఇందిరాదేవితో అపర్ణ అంటుంది.

ఆ తర్వాత బాబుని ఎత్తుకొని సుభాష్ బయటకు వెళ్తుంటే.. రాజ్ వెనకాలే వెళ్తాడు. వాళ్ళు వెళ్లడం చూసిన కావ్య ఏదో జరుగుతుందని వాళ్ళ వెనకాలే వెళ్తుంది. ఆ తర్వాత సుభాష్ కార్ కి అడ్డుగా రాజ్ మరో కార్ తో వెళ్లి ఆపేస్తాడు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారని సుభాష్ ని రాజ్ అడుగుతాడు. నిన్ను ఒక దోషిగా చూడడం నాకు ఇష్టం లేదు.. అంతా చెప్పాల్సి వస్తే ఆ నిజం నేనే చెప్పేస్తానని సుభాష్ అంటాడు. ఎవరికి ఆ నిజం చెప్పనని మాటిచ్చారని రాజ్ అంటాడు. బాబుని తీసుకొని రాజ్ వెళ్ళిపోతాడు. వాళ్ళ మాటలు దూరంగా విన్న కావ్య.. అంటే నిజం మావయ్య గారికి తెలుసన్నమాట.. ఎలాగైనా అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది. మరొకవైపు సేట్ దగ్గరికి వెళ్లి.. స్వప్నకి రాసిచ్చిన ఆస్తి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాలని రాహుల్ అనుకుంటాడు. స్వప్న ఆస్తి తాకట్టు పెట్టిందని ఇంట్లో వాళ్ళకి చెప్పు.. వాళ్ళు డబ్బులు ఇస్తారని సేట్ తో రాహుల్ చెప్తాడు. తరువాయి భాగంలో సుభాష్ ని నిజం చెప్పమని కావ్య అడుగుతుంది. చెప్పలేనని సుభాష్ అనగానే.. నా మీద ఒట్టే అని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.