English | Telugu

Brahmamudi:అందరిముందు తన భర్తని తిట్టిన అనామిక.. జెలస్ ఫీలవుతున్న రాజ్ !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -342 లో.. శ్వేతని రాజ్ తీసుకొని.. కావ్య, తన బావని ఫాలో అవుతు వాళ్ళ వెనకాలే రెస్టారెంట్ కి వస్తారు. ఇక కావ్య వాళ్ళ బావ భాస్కర్ అక్కడే ఉన్న రాజ్ ని చూసి కావాలనే.. తను జెలస్ ఫీల్ అవ్వాలని వెయిటర్ తో చెప్పి కేక్ బొకే తెప్పిస్తాడు. తన భార్యకి ప్రపోజ్ చేయబోతున్నాడనే ఫీల్ కల్పించి రాజ్ కి కోపం వచ్చేలా చేస్తాడు. వాడు నా భార్యకి ప్రపోజ్ చేస్తున్నాడని శ్వేతతో రాజ్ అంటాడు. చేస్తే నీకేంటి నువ్వు వద్దనుకుంటున్నావు కదా.. తన బావతో అయిన హ్యాపీ గా ఉండనివ్వని శ్వేత అంటుంది.

నేను ఇంకా డివోర్స్ తీసుకోలేదు అయిన అంత త్వరగా ఎలా రాంగ్ గా ఆలోచిస్తుంది. ఇది ఎలా ఆపాలని రాజ్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఉన్నా ప్లేస్ దగ్గరికి ఇందిరాదేవి, సీతారామయ్యలని భాస్కర్ రప్పిస్తాడు. వాళ్ళని అక్కడ చూసిన రాజ్.. ఇప్పుడు కావ్య నేను విడాకులు తీసుకుంటున్నట్లు తెలిస్తే కొంప మునుగుతుందని రాజ్ వెంటనే భాస్కర్, కావ్య ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్లి నిల్చొని ఉంటాడు. అప్పుడే ఇందిరాదేవి, సీతారామయ్య వచ్చి.. మీరు కూడా ఇక్కడికే వచ్చారా కావ్యకి వాలింటైన్ డే విషెస్ చెప్పడానికి తీసుకొని వచ్చావా అని ఇందిరాదేవి అనగానే.. అవునని రాజ్ అంటాడు. భాస్కర్ ఏదో చెప్పబోతుంటే నువ్వు అగని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ అందరి ముందు కావ్యకి వాలింటైన్ డే విషెస్ చెప్తాడు. కావ్య కూడ చెప్తుంది. ఇక్కడే ఉంటే వీడు కావ్యని మార్చేస్తాడని అనుకొని ఆఫీస్ లో వర్క్ ఉంది అంటు కావ్యని రాజ్ లాక్కొని వెళ్తాడు. ఆ తర్వాత రాజ్ జెలస్ ఫీల్ అవుతున్నాడని భాస్కర్, ఇందిరాదేవి, సీతారామయ్య నువ్వుకుంటారు.

ఆ తర్వాత కావ్య, రాజ్ లు ఆఫీస్ కి వెళ్తుంటారు. ఏంటి ఇదంతా మీరే ప్లాన్ చేశారనుకున్నాను. పాపం మా బావ చేశాడా అని రాజ్ కి ఇంక కోపం వచ్చేలా కావ్య మాట్లాడుతుంది. ఆ తర్వాత అనామిక దగ్గరికి రుద్రాణి వచ్చి నువ్వు నీ భర్తని ఆఫీస్ కి పంపించావ్ కానీ అతను అక్కడ ఏం చేస్తున్నాడో చూడాలి కదా అని రుద్రాణి అనగానే.. అవును ఆంటీ అంటూ అనామిక కూడా ఆఫీస్ కి వెళ్తుంది. ఆ తర్వాత కావ్య వేసిన డిజైన్స్ బాలేవంటు రాజ్ చిరాకు పడుతాడు. తరువాయి భాగంలో అనామిక ఇంట్లో అందరి ముందు కళ్యాణ్ ని తిడుతుంది. ఆఫీస్ కి వెళ్లి అక్కడ కూడా కవిసమ్మేళనం చేస్తున్నాడని అనగానే.. కళ్యాణ్ కి సపోర్ట్ గా కావ్య మాట్లాడుతుంది. దాంతో నీ వల్లే ఇదంతా అని కావ్యని అనామిక అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.