English | Telugu

Brahmamudi:ఎన్నిరోజులుగా సాగుతోందంటూ భర్తని నిలదీసిన భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -321 లో.. రాజ్, శ్వేత క్లోజ్ గా ఉండడం చుసిన కావ్య షాక్ అవుతుంది. ఇంటికి వస్తు కూడా అదే విషయం గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. కావ్య ఇంటికి రాగానే అనామిక ఎదరుగా వస్తుంది. నీకోసమే వెయిట్ చేస్తున్నాను.. నాకూ కాశ్మీర్ పులావ్ నేర్పించు అంటు కావ్యని అనామిక అడుగుతుంది. ఇప్పుడు ఇంట్రస్ట్ లేదు తర్వాత అని చెప్పిన కూడా కావ్యని విసిగిస్తుంది అనామిక.

ఆ తర్వాత నాకు ఓపిక లేదంటే అర్ధం కదా అని కావ్య అనగానే.. అదంతా చూస్తున్న ధాన్యలక్ష్మి వచ్చి.. ఏంటి నా కోడలిపై అరుస్తున్నావ్? తనేం అడిగింది కళ్యాణ్ కి ఇష్టమైన వంట నేర్పించమని అడిగింది అంతే కదా.. అదేదో మీ పుట్టింటి నుండి తెచ్చిన నగలు అడిగినట్లు అంత చిరాకు పడుతున్నావ్? ఒక్క రోజు ఆఫీస్ కీ వెళ్ళగానే అహంకారం వచ్చిందా అని ధాన్యలక్ష్మి అనగానే.. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నారు. నా పుట్టింటి గురించి తీస్తారేంటి? మీకు వండి వర్చి పెట్టడానికే పుట్టానా అని కావ్య అంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావని అపర్ణ వచ్చి అంటుంది. నా కోడలిపై అరిచే హక్కు నీకు ఎక్కడిది. తను ఆఫీస్ కి వెళ్లి అలసిపోయి వచ్చింది. నీ కోడలికి వంట నువ్వు నేర్పించుకో.. ఇక నుండి కావ్య ఆఫీస్ కి వెళ్తుంది.. నీ కోడలు వంట చెయ్యాలని అపర్ణ ఆర్డర్ వేస్తుంది. కావ్య నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకోమని కావ్యని పంపిస్తుంది అపర్ణ. ఆ తర్వాత బాధపడుతున్న కావ్య దగ్గరికి కళ్యాణ్ వచ్చి.. ఆఫీస్ లో ఏమైందని అడుగుతాడు.

రాజ్ ఆఫీస్ నుండి శ్వేత దగ్గరికి వెళ్లిన విషయం.. వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉన్న విషయం కళ్యాణ్ తో కావ్య షేర్ చేసుకుంటుంది. అన్నయ్య ఇంతలా మారిపోయాడా అని కళ్యాణ్ అంటాడు. ఇక లేట్ చెయ్యకు.. అన్నయ్య వచ్చాక అన్ని అడుగమని కళ్యాణ్ సలహా ఇస్తాడు. కాసేపటికి రాజ్ ఇంటికి వస్తాడు. రాజ్ రాగానే.. ఎక్కడకి వెళ్ళావని కావ్య అడుగుతుంది. ఏంటి నా గురించి అడగాల్సిన అవసరం లేదని రాజ్ అనగానే.. నేను నీ భార్యని శ్వేతని కాదని కావ్య అంటుంది‌. అది విని రాజ్ షాక్ అవుతాడు. మీరు రహస్యంగా కలుస్తున్న శ్వేత ఎవరని కావ్య అడుగుతుంది.. కొన్ని రోజులు ఉండి వెళ్లేదానివి.. నీకు చెప్పాలిసిన అవసరం లేదు అయిన నిన్ను భార్యగా నేను అనుకోవట్లేదని రాజ్ అనగానే.. నన్ను భార్యగా అనుకోకపోవడానికి మీ దగ్గర కారణాలు ఉన్నాయా అని కావ్య అడుగుతుంది. తరువాయి భాగంలో నువ్వు నా భార్య కాదని అనడానికి చాలా కారణాలున్నాయంటూ ఒక బోర్డుపై రాజ్ రాస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.