English | Telugu
డిజైన్స్ వేస్తూ దొరికిపోయిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!
Updated : Jul 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -154 లో... కావ్య తనని పట్టించుకోవడం లేదని స్వప్న చెప్పగానే.. కావ్యకి సపోర్ట్ చేస్తూ రాజ్ మాట్లాడడంతో అందరు ఆశ్చర్యపోతారు. స్వప్నని వాళ్ళ అత్తగారు పట్టించుకోవాలని ధాన్యలక్ష్మి అనగానే.. నేను ఎందుకు పట్టించుకోవాలి.. ఏరి కోరి దరిద్రాన్ని తీసుకొని వచ్చారు కదా అని రుద్రాణి కోపంగా మాట్లాడి వెళ్ళిపోతుంది.
మరొక వైపు అప్పుకి హెల్ప్ చెయ్యాలని కళ్యాణ్ ఫ్రెండ్స్ తో పిజ్జా ఆర్డర్ ఇప్పించి టిప్పు ఎక్కువ వచ్చేలా చేస్తాడు. దాంతో అప్పుకి కొంత డబ్బు సర్దుబాటు అవుతుంది. మరొకవైపు దుగ్గిరాల ఇంట్లో అందరు కలిసి భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ పై కూర్చొని ఉంటారు. ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఎవరికి వారు ఫోన్ చూస్తుంటారు. అది చూసిన ఇందిరా దేవి కోపంగా.. అందరు ఏం చేస్తున్నారు. తినడానికి వచ్చారా ఫోన్ చూడడానికి వచ్చారా? భోజనం చేసేటప్పుడైనా అందరు కలిసి మాట్లాడుకోవచ్చు కదా. ఇక నుండి మీ అందరి ఫోన్ లు తినేముందు ఇక్కడ పెట్టాలని అందరి ఫోన్లు తీసుకుంటుంది. అప్పుడే అక్కడ ఉన్న రాజ్.. ఫోన్ ని కొందరు మంచికి వాడుకుంటారని కావ్యని ఉద్దేశించి అంటాడు. ఎవరని ఇందిరాదేవి అడుగుతుంది.
ఒక అమ్మాయి మనకు డిజైన్స్ ఫోన్ లో పంపిస్తుందని రాజ్ అనగానే.. ఎవరు ఆ అమ్మాయి అని ఇందిరాదేవి అడుగుతుంది. కావ్య వైపు చూస్తూ శిరీష అని చెప్తాడు. మరొక వైపు అప్పు ఇంటికి రాకపోవడంతో కనకం, కృష్ణమూర్తి లు కంగారు పడుతారు. అప్పుడే అప్పు ఇంటికి వస్తుంది. అమ్మ ఇదిగో డబ్బులు.. పిజ్జా డెలివరీ కి వచ్చినవి. మిగతా డబ్బులు రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తానని అప్పు అనగానే.. కనకం, కృష్ణమూర్తి ఇద్దరు ఎమోషనల్ అవుతారు. కావ్య తర్వాత మన ఇంటి బాధ్యత అప్పు తీసుకుందని కృష్ణమూర్తి అంటాడు.
మరొకవైపు రాజ్ నిద్రపోయాక కావ్య రాజ్ కి తెలియకుండా హాల్లో కి వెళ్లి డిజైన్స్ వేస్తుంది. రాజ్ నిద్రలేచి డిజైన్స్ వెయ్యడానికి వెళ్లిందా.. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటా అని కావ్య దగ్గరికి వస్తాడు రాజ్. కావ్య వేసే డిజైన్స్ వెనకాల నుండి చూస్తాడు. రాజ్ ని కావ్య చూస్తుంది. నాకు తెలియకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నావని కావ్యని అడుగుతాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!