English | Telugu

Brahmamudi : ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఎవరని...అడిగిన భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -807 లో.....రాజ్ కి నిజం చెప్పి కావ్యని తన దృష్టిలో బ్యాడ్ చెయ్యడానికి రుద్రాణి అనుకుంటుంది. రాజ్ దగ్గరికి రుద్రాణి వచ్చి.. నువ్వు అమెరికా వెళ్లొద్దని చెప్తుంది కావ్య.. నిన్ను వద్దనడానికి కారణం కావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అని రుద్రాణి చెప్తుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. అప్పుడే కావ్య వస్తుంది. మీకోక విషయం చెప్పాలని రాజ్ తో కావ్య అనగానే మీరు ప్రెగ్నెంటా అని రాజ్ అడుగుతాడు.

దాంతో కావ్య షాక్ అవుతుంది. రుద్రాణి వంక చూస్తుంది. రాజ్ ని ఎలా ఆపాలో తెలియక నిజం చెప్పేసానని రుద్రాణి అంటుంది. నువ్వు ప్రెగ్నెంటా అని కావ్యని రాజ్ అడుగుతాడు. దానికి సమాధానంగా కావ్య అవునని చెప్తుంది. మీరంతా ఫ్రాంక్ చేస్తున్నారు కదా అని రాజ్ నవ్వుకుంటాడు. నిజమే చెప్తున్నాను నమ్మండి అని కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి దగ్గరికి రాజ్ వచ్చి అడుగుతాడు. వాళ్ళు కూడ నిజమే అని చెప్తారు. ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు.. ఇన్ని రోజులు తన వెంటపడుతుంటే ఎందుకు ఎంకరేజ్ చేసారని రాజ్ వాళ్లపై కోప్పడతాడు. అసలు కావ్య ప్రెగ్నెంట్ కి ఎవరు కారణం అని రాజ్ వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు మౌనంగా ఉంటారు. నాకు తన మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉందని రాజ్ వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత రాజ్ డల్ గా ఉండడం తో యామిని పేరెంట్స్ వెళ్లి యామినిని పెళ్లి చేసుకోమని అంటారు. లేదు నేను చేసుకోను.. కావ్య నన్ను మోసం చేసింది కానీ తప్పు చెయ్యలేదని నమ్ముతున్నానని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య దగ్గరికి రాజ్ వచ్చి అసలు నీ కడుపుకి కారణం ఎవరు అంటూ తప్పుగా మాట్లాడుతుంటే.. రాజ్ చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. ఆ కడుపుకి కారణం నువ్వేరా నువ్వు తన భర్తవి.. నా కొడుకువి అని అపర్ణ చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.