English | Telugu

బిగ్ బాస్ అన్ని సీజన్లలో అత్యధిక టీఆర్పీ సీజన్-7 కే!

బిగ్ బాస్ సీజన్‌ సెవెన్ ఎంత గ్రాంఢ్ గా హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే దీనికి కారణం ఎవరు? కంటెస్టెంట్సా? హోస్ట్ నాగార్జున వల్లనా? వీటితో పాటు గ్రాంఢ్ పినాలే టీఆర్పీ ఎంత వచ్చిందని ఎందరో ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ 7 మాత్రం నేషనల్ లెవల్‌లో తలెత్తుకునే రేటింగ్‌ని రాబట్టిందనే అందరికి తెలిసిన నిజం. డిసెంబర్ 17 ఆదివారం నాడు జరిగిన బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌‌ 21.7 TVR రేటింగ్ సాధించి సరికొత్త రికార్డుల్ని నెలకొల్పింది. ఈ సీజన్ మొదలైనరోజు నుండి ఉల్టా పుల్టా అంటు భారీ హైప్ క్రియేట్ చేసాడు హోస్ట్ నాగార్జున.

ఇక ఆరో సీజన్‌కి బిగ్ బాస్ హిస్టరీలోనే ది వరస్ట్ రేటింగ్‌లు రావడంతో.. ఫినాలే ఎపిసోడ్ రేటింగ్‌లను కూడా ప్రకటించలేదు. ఫినాలే వీక్‌లో అత్యల్పంగా 0.86 రేటింగ్ సాధించిందంటే.. ఆ సీజన్ ఎంత వరెస్ట్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు ఏ భాషలోను ఇంత దారుణమైన రేటింగ్ నమోదు కాలేదు. వీకెండ్‌లో 3.62.. వీక్ డేస్‌లో సరాసరి 2.33గా రేటింగ్ వచ్చేది. సీరియల్స్ రేటింగ్ కంటే తక్కువ రావడంతో.. బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే రేటింగ్స్‌ని ప్రకటించనేలేదు. ఈ బిగ్ బాస్ సీజన్-7 తాజా రేటింగ్స్ ప్రకారం.. 21.7 TVR రేటింగ్స్‌ని సాధించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సీజన్ 4కి సరిగ్గా 21.7 రేటింగ్ వచ్చింది. ఇప్పటివరకు ఇండియాలో జరిగిన ఏ బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి రానంత వ్యూవర్ షిప్ అభిజిత్ విన్నర్ అయిన సీజన్-4కి వచ్చింది. మళ్ళీ అదే రేటింగ్ ఈ సీజన్-7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాక వచ్చింది.

అసలు ఏలా ఇంత హిట్ అయిందంటే.. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ లో అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి ఉన్నారు. యాక్టర్ శివాజీ, కామన్ మ్యాన్ క్యాటగిరీలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఇక వచ్చిన మొదటి వారంలోనే రైతుబిడ్డని టార్గెట్ చేసి సెలబ్రిటీ లిస్ట్ లో ఉన్నవాళ్ళంతా నామినేషన్ చేయడంతో.. ఆ హీటెడ్ ఆర్గుమెంట్స్ లో రైతులు వర్సెస్ బిటెక్ స్టూడెంట్స్ అనే ఇష్యూ బయటకు రావడంతో అది రెండు రాష్ట్రాలలో విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. దానితో పాటు యాక్టర్ శివాజీ ఫెయిర్ అండ్ క్లీన్ గేమ్ స్ట్రాటజీ, యావర్ అటిట్యూడ్, రైతుబిడ్డ ప్రశాంత్ టాస్క్ లలో వందకి వంద శాతం కష్టం.. కార్తీక దీపం మోనిత నటవిశ్వరూపం, టేస్టీ తేజ కామెడీ, ఆట సందీప్ స్ట్రాటజీ, అమర్ దీప్ ఫౌల్ గేమ్స్ ఆడటం, రతిక లవ్ ట్రాక్, శుభశ్రీ రాయగురు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పడం, అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ గౌతమ్ కృష్ణ చెప్పడం, సీరియల్ బ్యాచ్ కి భోలే షావలి ఇచ్చిన మాస్ పంచ్ లు.. ఇలా చెప్పుకుంటు పోతే అన్నీ హిట్ అయ్యాయి. దీంతో ఈ సీజన్ గ్రాంఢ్ గా హిట్ అయింది. అత్యధిక టీర్పీతో దూసుకెళ్లింది.‌ ఇక ఈ సీజన్ టీఆర్పీని స్టార్ మా అఫీషియల్ సైట్ లో తెలిపారు.


Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.