English | Telugu

Maryadha manish eliminated : బిగ్‌బాస్‌ నుంచి మనీష్‌ మర్యాద ఎలిమినేట్‌!

బిగ్ బాస్ సీజన్-9(Bigg boss 9 Telugu) రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటివారం శ్రష్టి వర్మ ఎలిమినేషన్ అవ్వగా రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నామినేషన్లలో మనీష్‌తో పాటు, సుమన్‌శెట్టి, ప్రియ, డీమాన్ పవన్, హరిత హరీష్, ఫ్లోరా షైనీ, మరియు భరణి ఉన్నారు.

ఇక శనివారం నాటి ఎపిసోడ్ లో ఎవరిని సేవ్ చేయలేదు నాగార్జున. నిన్నటి సండే ఎపిసోడ్ లోనే అందరిని సేవ్ చేసి చివరి వరకు ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్ ని ఉంచారు. అయితే కామనర్ గా వచ్చిన మర్యాద మనీష్ కి ఓట్ బ్యాకింగ్ అంతగా లేదు. పైగా అతని ఆటతీరు కూడా పెద్దగా కనపడలేదు. అయితే ఫ్లోరా సైనీ ఫస్ట్ వీక్ ఓటింగ్ లో ఉండటం, ఈ వీక్ లో ఉండటం తనకి కలిసొచ్చింది. అందుకే మర్యాద మనీష్(Maryadha manish) కన్నా అత్యధిక ఓట్లు పడ్డాయి. సుమన్ శెట్టి(Suman Shetty) రెండు వారాలు నామినేషన్లో‌ ఉండటం మరియు అతనికి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండటంతో అతను అత్యధిక ఓటింగ్ తో‌ నెంబర్ వన్ లో నిలిచాడు.

ఇక సండే ఫన్ డే అంటు కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడిస్తూ, ఆటలు ఆడిస్తూ, మధ్య మధ్యలో నామినేషన్ లో ఉన్నవాళ్ళని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా చివరికి ఫ్లోరా షైనీ, మర్యాద మనీష్‌ మిగిలారు. వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్తారని అందరిలో ఉత్కంఠ పెరిగింది. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు పొందిన ఫ్లోరా సైనీ సేఫ్ అయ్యింది. దీంతో మనీష్ బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.