English | Telugu

జాక్ పాట్‌ కొట్టిన బిగ్‌ బాస్‌ 6 విన్నర్‌ రేవంత్‌!


బిగ్‌ బాస్‌ తెలుగు 6వ సీజన్‌ ఎట్టకేలకు ఆదివారంతో ముగిసిపోయింది. 105 రోజులపాటు జరిగిన ఈ సీజన్ కి ఇక్కడితో ఎండ్ కార్డు పడింది. టాప్‌ 5గా ఉన్న రేవంత్‌ , శ్రీహాన్‌ , ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్‌ లో ఈ సీజన్‌ బిగ్‌ బాస్‌ విన్నర్‌గా రేవంత్‌ నిలిచారు.

ఐతే అందులోనే పెద్ద ట్విస్ట్ ఉందని అదేంటంటే ఓటింగ్‌ ప్రకారం శ్రీహాన్‌కి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు హోస్ట్. రేవంత్‌కి మొత్తంగా ఎంత వచ్చిందనేది చూస్తే, బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 ట్రోఫీతో పాటు 10 లక్షల ప్రైజ్‌ మనీ దక్కుతుంది. దీంతోపాటు `సువర్ణభూమి` వారి 650గజాల ఫ్లాట్‌ దక్కబోతుంది. అంటే సుమారు 30 లక్షల విలువ చేసే దీన్ని సువర్ణభూమి వారు విన్నర్‌కి ఈ గిఫ్ట్ ని ప్రకటించారు. మరోవైపు పది లక్షల విలువైన బ్రేజ్జా కారుని బహుమతిగా మారుతి సుజికి వారు ప్రకటించారు. ఇలా మొత్తంగా రేవంత్‌కి యాభై లక్షలు అందుకున్నారని చెప్పొచ్చు. మొత్తంగా రేవంత్‌ బిగ్‌ బాస్‌ విన్నర్‌గా సుమారు డెబ్భై నుంచి ఎనబై లక్షల వరకు పారితోషికం అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. రేవంత్‌కి ఇటీవలే కూతురు పుట్టింది. తన ఇంట్లోకి లక్ష్మీ దేవి వచ్చిందని ఆయన ఎంతో సంబరపడ్డారు. తన కూతురుకి ట్రోఫీని గిఫ్ట్ గా ఇస్తానని చెప్పడం విశేషం. అదే విషయాన్ని ఆయన స్టేజ్‌పై ఎమోషనల్‌ అవుతూ చెప్పారు.

శ్రీహాన్‌ కారణంగా రేవంత్‌ జాక్ పాట్‌ కొట్టాడు. రియల్‌ హీరో అయ్యారు. అయితే ఈ సీజన్‌కి మాత్రం రేవంత్‌, శ్రీహాన్‌ ఇద్దరూ విన్నర్సే అని చెప్పొచ్చు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.