English | Telugu

'భార్యని, పిల్లల్ని ప్రేమించనోడు మనిషా అన్నా!'.. పూరిపై బండ్ల గణేష్ సెన్సేష‌న‌ల్ కామెంట్‌!

సందు దొరికితే చాలు ఈమ‌ధ్య‌ పూరి జగన్నాథ్‌ మీద చుర‌క‌లు వేస్తూ ఉన్నాడు బండ్ల గ‌ణేశ్‌. పూరి కొడుకు ఆకాశ్ హీరోగా న‌టించిన‌ 'చోర్ బజార్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన గణేష్ అక్కడ స్టేజి మీద పూరీపై సెటైర్ల మీద సెటైర్లు వేసాడు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. “పూరి ఎంతోమందిని స్టార్లని చేశాడు కానీ కన్న కొడుకుని స్టార్ ని చేయలేకపోయాడు" అంటూ గణేష్ సెటైర్స్ వేయడం, దానికి కౌంటర్ గా పూరి కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రివర్స్ కౌంటర్ లు వేయడం మనకు తెలిసిన విషయమే.

ఐతే ఇటీవల బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. "రాజకీయాలను ఎందుకు కెలుకుతున్నార"ని యాంకర్ అడిగేసరికి .. "నేనెక్కడ కెలికాను" అంటూ బండ్ల గణేష్ మాట దాటేశాడు. "పోసానికి చావు మామూలుగాఉండదు అని మీరెలా చెప్తారు?" అని యాంకర్ అడిగేసరికి “నువ్వు పెట్టే బోనులో పడే ఎలుకలు చాలా ఉంటాయి. బండ్ల గణేష్ పడడు” అంటూ సమాధానమిచ్చాడు. "అసలు పోసాని గురించి ఆ మాట ఎందుకన్నారు? ఆ ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీయే కదా" అని అడిగేసరికి, “బండ్ల గణేష్ మీద కోపముంటే నన్ను తిట్టు, నన్ను కొట్టు. కానీ మా అమ్మ, నాన్న ఏం చేశారు?” అంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు బండ్ల గణేష్.

“మరి పూరీ ఎందుకు స్పందించారు? నాలుక జాగ్రత్తగా పెట్టుకో అని ఎందుకన్నారు?” అని యాంకర్ అడగడంతో ''భార్యని, పిల్లల్ని ప్రేమించనోడు మనిషా అన్నా" అంటూ బండ్ల గణేష్ ఫైర్ అయ్యాడు. “ప్రేమించడం, ప్రేమించకపోవడం ఆయనిష్టం” అని యాంకర్ సమాధానం ఇచ్చి పూరికిఫోన్ చేయబోతే.. “పూరీ అనే వాడికి మంచి, చెడు చెప్పే రైట్ నాకు ఉంది. అతనునా ఫ్రెండ్. నువ్ ఫోన్ పెట్టు ముందు” అంటూ బండ్ల గణేష్ గట్టిగా అరిచేసాడు. ఇక ఈ హాట్ హాట్ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.