English | Telugu

లాక్ డౌన్ టైములో సాయి శ్రీనివాస్ మూవీ రిలీజ్ కాలేదు.. నిజంగా బ్యాడ్ లక్!

బిబి జోడి సీజన్ 2 ఈ వారం శనివారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఈ షోలో సాయిశ్రీనివాస్ - నయనిపావని జోడి పెర్ఫార్మ్ చేసాక శ్రీనివాస్ వాళ్ళ సిస్టర్ అంబికా స్టేజి మీదకు వచ్చి ఒక టీ కప్ తీసుకొచ్చి గిఫ్ట్ చేసింది. ఇలాంటి ఆపర్చునిటీ తన బ్రదర్ కి ఇలా దొరకడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. రోజు ఈ కప్ లో కాఫీ తాగుతూ ఎలా కష్టపడాలి అని ఆలోచించాలి ఫైనల్ గా ఎలా బిబి జోడి కప్ తీసుకోవాలి అని ఆలోచించు అంటూ విష్ చేసింది.

తర్వాత శేఖర్ మాష్టర్ కూడా ఒక విషయాన్నీ చెప్పారు. "కరెక్ట్ గా లాక్ డౌన్ టైములో సాయి ఒక మూవీ చేసాడు. నా ఫ్రెండ్ అజయ్ మంచి కొరియోగ్రాఫర్. సాయి బాడ్ లక్ అజయ్ బాడ్ లక్ ఏంటంటే లాక్ డౌన్ వచ్చింది. ఆ టైములో మూవీని ఇక్కడ రిలీజ్ చేయలేకపోయారు. దాన్ని యూఎస్ లో రిలీజ్ చేశారు. నిజంగా అలాంటి మూవీ ఇప్పుడు వస్తే డెఫినెట్ గా నువ్వు చేతికి అందవు సాయి. మంచి పొజిషన్ లో ఉంటావు. చెప్తున్నా ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ చూసి నీకు అవకాశం ఇస్తే గనక నీకు నువ్వు డెఫినెట్ గా ప్రూవ్ చేసుకోగలవు ఆ టాలెంట్ నీలో ఉంది" అని చెప్పారు.

ఇక నయని పావని కూడా ఒక విషయాన్నీ చెప్పుకొచ్చింది. "నాకు ఒక అక్క ఉంది. మా అక్క కూడా అంతే. తన లైఫ్ తనకు అస్సలు చూసుకోకుండా నేనేం చేయాలి నేనేం చేస్తే బాగుంటుంది అనేదే ఆలోచిస్తుంది. నేను ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం తనే. నా పేరు పావని. మా అక్క పేరు నయని. నేను మా అక్క పేరుని పెట్టుకున్నాను. నీ పేరు ఎప్పుడు నా లైఫ్ లోకి వచ్చిందో అప్పుడు నాకు అన్నీ వచ్చాయి .నాకు మా అక్క లక్కీ చార్మ్" అంటూ చెప్పింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.