English | Telugu

రతిక మైండ్ గేమ్.. బూతులతో రెచ్చిపోయిన అమర్ దీప్!

బిగ్ బాస్ సీజన్-7 అతి తక్కువ మందితో స్టార్ట్ చేసి అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ప్రతీ సీజన్ లో 21 మందికి పైగా కంటెస్టెంట్స్ తో గేమ్స్, టాస్క్ అంటూ బిజీ చేసిన రాని కిక్కు.. ఇప్పుడు పదమూడు మంది కంటెస్టెంట్స్ తోనే వస్తుంది. తాజాగా టీవీ షోలలో బిగ్ బాస్ సీజన్-7 కి అత్యధిక టీఆర్పీ రేటింగ్ వస్తుంది. దీనికి కారణాలు బోలేడున్నాయి‌. మొదటిది రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, రెండవది ఇంటికి పెద్ద తిక్కు యాక్టర్ శివాజీ. ఇక మిగిలిన సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్... ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంటున్నారు.

రతిక తన మైండ్ గేమ్ తో హౌజ్ మేట్స్ కి మెంటల్ ఎక్కిస్తుంది‌. నిన్నటి వరకు జరిగిన రణధీర, మహాబలి టీమ్ ల పోటీలో రణధీర టీమ్ గెలిచి ఒక్కొక్కరు ఒక్కో పవరస్త్రలోని భాగాన్ని పొందారు. కాగా గురువారం నాటి ఎపిసోడ్‌లో ఓడిపోయిన మహాబలి టీమ్ లోని కంటెస్టెంట్స్ కి గెలిచిన వారిలో నుండి విజేతను ఎన్నుకునే అవకాశాన్ని కలిగించాడు బిగ్ బాస్. కాగా పల్లవి ప్రశాంత్ వెళ్ళి అమర్ దీప్ దగ్గరున్న 'కీ' ని తీసుకొని శివాజీకి ఇచ్చాడు. ఇక కాసేపటికి దామిణి వెళ్లి షకీలకి 'కీ' ఇచ్చింది. ‌అయితే మిగిలిన ముగ్గురిలో అందరూ చివరి స్థానంలో వెళ్తానని అన్నారు. టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, రతిక ఉండగా.. రతిక చివరగా వెళ్తానని వాదనకి దిగింది. ఇదేం గ్రూప్ అసలు నా నిర్ణయానికి వాల్యూ లేదా అంటూ రతిక అనగా.. గౌతమ్ కృష్ణ వివరణ ఇస్తున్నాడు.‌ అయిన సరే మహాబలి గ్రూప్ అంతా కలిసి తర్వాత వెళ్ళాళ్సింది రతిక అన్నా సరే తను వెళ్ళకుండా అలాగే టైమ్ చేసింది. ఇక సంచాలక్ గా చేస్తున్న ఆట సందీప్ ఓపికకి పరీక్ష పెట్టింది రతిక.

ఇక రతిక చూపించే అటిట్యూడ్ కి మహాబలి టీమ్ తో పాటు రణధీర టీమ్ లోని కంటెస్టెంట్స్ కి కూడా చిరాకేసింది‌. ఇక ఆట సందీప్ కి ఓపిక నశించి.‌ అసలేంటి నువ్వు నీ దగ్గర ఉన్న కీ తెచ్చి ఎవరికో ఒకరికి ఇవ్వమని అడుగగా.‌. ఇంకా డిసైడ కాలేదని అన్నాక బిగ్ బాస్ వాయిస్ వస్తుంది. మహాబలి టీమ్ కి ఇచ్చిన సమయాన్ని సరిగ్గా వాడుకోలేకపోయారు కాబట్టి ఇక పవరస్త్రని దక్కించుకునే అవకాశం రణధీర టీమ్ చేతులలోకి వెళ్ళిందని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో అన్నాడు. అయితే ఇక ఎవరి దగ్గర పవరస్త్రలోని భాగం లేదో వారికి ఎవరు మరొక 'కీ' ని ఇవ్వకూడదని ఉన్నవాళ్ళ దగ్గర నుండి తీసుకొని కీ ఉన్నవాళ్ళకే ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పగా.. ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లు పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అమర్ దీప్ రతికని ఉద్దేశించి పచ్చి బూతులు తిడుతూ తన ఫ్రస్టేషన్ ని చూపించాడు. అయితే అమర్ దీప్ మాట్లాడిన బూతు మాటలు సెన్సార్ కట్ వేశారు. అప్పటికే హౌజ్ లోని వాళ్లంతా తనని కూల్ చేసే ప్రయత్నం చేసిన అతను ఊరుకోలేదు. రెచ్చిపోయి మరీ రతికని తిట్టాడు. గేమ్ ఆడేవాళ్ళకి అవకాశం లేకుండా చేసిందంటూ రతికపై అమర్ దీప్ రెచ్చిపోయాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.