English | Telugu

రాజా ఎప్పుడైనా నన్ను అలా పిలిచావా?

క్యాష్ ప్రోగ్రాంతో సుమకి ఒక క్రేజ్ అనేది వచ్చేసింది ఆడియెన్స్ లో. క్యాష్ ప్రోగ్రాంకి సుమ తప్ప వేరేవారిని అస్సలు ఊహించుకోలేరు. సుమకి, ఆమె భ‌ర్త‌ రాజీవ్ కనకాలకు ఉన్న‌ ఫాలోయింగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. బుల్లితెర మీద అందరి జంటల్లాగే వీళ్లకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఆడియన్స్ లో. గతంలో ఈ ఇద్దరూ విడిపోయారని, వేరువేరుగా ఉంటున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వాటిని బ్రేక్ చేస్తూ సుమ ఒక క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఐనా సోషల్ మీడియాకి గొంతు పెద్దది.. ఎప్పుడూ ఎదో ఒకటి అంటూనే ఉంటుంది. సుమ, రాజీవ్ అస్సలు కలిసి ఏ షోలో కూడా కనిపించరు, ఇద్దరి మధ్య పొసగట్లేదని కూడా తర్వాత వార్తలు వస్తూనే ఉన్నాయి.

సుమ మాత్రం వాటిని అస్సలు పట్టించుకోవడం మానేసింది. ఐతే క్యాష్ ప్రోగ్రాం రాబోయే ఎపిసోడ్ కి సీతారామం టీం ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్, తరుణ్ భాస్కర్, సుమంత్, హను రాఘవపూడి గెస్టులుగా వచ్చారు. సుమ దుల్కర్ తో కలిసి స్టెప్పులేసింది. దుల్కర్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని ఈ ప్రోమో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆడియన్స్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ దుల్కర్ పై కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. కళ్యాణి అనే ఒక అమ్మాయి "మీ భార్య మిమ్మల్ని ఏమని పిలుస్తారు" అని దుల్కర్ ని అడిగింది. "జాన్" అని పిలుస్తుందని చెప్పారు దుల్కర్. తర్వాత సుమ "మీరు మీ వైఫ్ ని ఏమని పిలుస్తారు?" అని అడిగింది. 'సీజియో' అని ఒక వెరైటీగా నిక్ నేమ్ చెప్పాడు దుల్క‌ర్‌.

అమల్ సూఫియా, జాన్ కాబట్టి రెండు పేర్లు కలిపి ముద్దుగా పిలుస్తాడనే విషయం అర్థ‌మవుతోంది. వెంటనే సుమ అందుకుని "రాజా చూసావా, ఎప్పుడైనా అలా పిలిచావా నన్ను?" అని అడిగింది. ఆ ప్రశ్నకు స్టేజి మీద అందరూ నవ్వేశారు. తర్వాత ఒక అమ్మాయి దుల్కర్ కోసం ఒక సాంగ్ పాడింది. తర్వాత లేడీ ఫాన్స్ అంతా గులాబీలు ఇచ్చి అతనితో కలిసి డాన్స్ చేశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.