English | Telugu

చరణ్ కి స్టేజి మీద ప్రొపోజ్ చేసిన శ్రీముఖి

"సరిగమప" ది సింగింగ్ సూపర్ స్టార్ట్ సెమీ ఫైనల్ కు వచ్చేసింది. ఇటీవల రిలీజ్ ఐన ఈ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్ లో శ్రీముఖి సాయి శ్రీచరణ్ కి ఇండైరెక్ట్ గా ప్రొపోజ్ చేసేసింది. "ఆ నీలి గగనాల ఓ దివ్య తార" అంటూ పాట పాడి అందరిని మైమరిపించాడు తన గాత్రంతో. ప్యూర్ లవ్ తో చరణ్ ఈ పాట పాడాడు అని కోటి గారు కామెంట్ చేసేసరికి చరణ్ కూడా భలే సిగ్గుపడిపోతాడు. "నాకు నీ పెర్ఫార్మెన్స్ చాలా హ్యాపీగా అనిపించింది" అని స్మిత బెస్ట్ కంప్లిమెంట్ ఇస్తుంది. ఇక పాట మధ్యలో " ఈ పరిచయం ఒక వరమా , నా మనసు పడిన విరహ వేదన తొలి ప్రేమలోని మధుర భావన " అనే చరణాలని చరణ్ తో జత కట్టి పడేసరికి జడ్జెస్ అంతా విజిల్స్ వేస్తారు.

ఇక తర్వాత "మోవయ్యా" అంటూ చరణ్ వాళ్ళ నాన్నను స్టేజి మీదకు పిలుస్తుంది శ్రీముఖి. "మా ఆవిడ రావాల్సింది రాలేకపోయింది" అని ఆయన అనేసరికి "అత్తమ్మా" అంటుంది శ్రీముఖి. చరణ్ వాళ్ళ నాన్నకు కోపం వచ్చి "అత్తమ్మో, గిత్తమ్మో ఎవరో ఒకరు కానీ ..ఆవిడ నిన్ను మూడు ప్రశ్నలు అడగమంది. వాటికి నువ్వు సరిగ్గా ఆన్సర్స్ చెప్తే తనకేం ఇబ్బంది లేదు కంటిన్యూ అవ్వొచ్చు అని చెప్పింది " అంటారు. సరే అడగండి మావయ్య అంటుంది శ్రీముఖి. నీకు "ముగ్గు వేయడం వచ్చా శ్రీముఖి" అని ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు.. "ముగ్గులోకి దింపడం వచ్చు మావయ్య" అంటుంది. ఆ ఆన్సర్ కి అందరూ కెవ్వుమని నవ్వుతారు. ఇలా ఈ వారం ఎపిసోడ్ శ్రీముఖి, చరణ్ మధ్య చిన్న చిన్న రొమాంటిక్ మూమెంట్స్ తో అందంగా ఎంటర్టైన్ చేయబోతోంది. మరి మిగతా రెండు ప్రశ్నలు మోవయ్యా ఏం అడిగారు, శ్రీముఖి ఏం జవాబులు ఇచ్చింది..ఫైనల్ గా చరణ్ కి, శ్రీముఖికి లైన్ క్లియర్ అయ్యిందా లేదా అనేది తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూసెయ్యాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.