English | Telugu

యాంకర్ సౌమ్య రావుకి యాక్సిడెంట్.. ఒక పెద్ద హీరోతో ఇంటర్వ్యూ!

బుల్లితెర మీద యాంకర్ సౌమ్య రావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆదితో జోడిగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే సౌమ్య తెలుగు మీద ఆది చేసే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి సౌమ్య ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. " ఇండస్ట్రీల హార్డ్ వర్క్ ఎం పనికి రాదురా..లక్కే ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్ లో ఉన్నవాళ్లందరికీ నిజంగానే టాలెంట్ ఉందా ?. కొంతమంది లక్కు వలన వస్తే , కొందరు గిమ్మిక్స్ చేసి వచ్చారు, వస్తూనే ఉన్నారు. లాస్ట్ టైం ఉదయభాను గారు ఒక మాట అన్నారు ఇక్కడ సిండికేట్ జరుగుతుంది అన్నారు. అది నూటికి నూరు శాతం ఈ ఫీల్డ్ లో ఉంది. నేను కూడా ఫేస్ చేసాను. నేను ఒక సీరియల్ చేస్తున్నప్పుడు ఒక హీరోయిన్ ఆ హీరో మధ్య ఏదో పర్సనల్ గా ఉండేది. షూటింగ్ అంతా ప్యాకప్ ఐపోయాక ఆ అబ్బాయి వచ్చి నాకు చెప్తున్నప్పుడు ఆ హీరోయిన్ కార్ ని రివర్స్ గేర్ వేసి వేసి వచ్చి నన్ను గుద్దేసింది.. నాకు అదో హారిబుల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది.

ఇండస్ట్రీ నాకు ఇచ్చినదాని కన్నా నేను పోగొట్టుకున్నది ఎక్కువ. ఒక రోజు నేను ఒక పెద్ద హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాలి. ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యింది. కాలు మొత్తం బ్లడ్. అక్కడి నుంచి నేను లేచి మళ్ళీ ఇంటర్వ్యూ ప్లేస్ కి వెళ్ళిపోయాను. చాలా కష్టాలు పడ్డాను. దేవుడు కనిపిస్తే మా అమ్మకు అలాంటి రోగం లేదు అనే రిపోర్ట్ రావాలని కోరుకుంటా అప్పుడు మా అమ్మ ఇంకా బాగుండేది నాతో ఉండేది కదా అనుకుంటా. మా అమ్మకు ఎం చెప్తాను. నాకు ఆమె అన్నీ.. నాకు ఇప్పుడు జ్ఞాపకంగా మిగిలిపోయింది." అంటూ బాధపడుతూ చెప్పింది సౌమ్య.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.