English | Telugu

ఇంద్రధనుస్సు చీర కట్టి....అందానికి టాక్స్ కట్టాలనే రూల్ ఉంటేనా....

అనసూయ అంటే చాలు సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్. మంచిగా కామెంట్స్ పోస్ట్ చేస్తే పద్దతిగా రిప్లై ఇస్తుంది. అంతకు మించి ప్రవర్తిస్తే అలాగే ఘాటుగా వ్యవహరిస్తోంది. అనసూయ డోంట్ కేర్ అనే టైపు...హార్ట్ వరకు ఏ విషయాన్ని కూడా తీసుకోదు. అలాంటి అనసూయ తన లేటెస్ట్ అప్ డేట్స్ ని అన్నిటినీ కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇక ఇప్పుడు మకర సంక్రాంతి సందర్భంగా క్యూట్, లేటెస్ట్ పిక్స్ ని, తన ఫామిలీతో కలిసి ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది. అలాగే ట్విట్టర్ లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పండగ శుభాకాంక్షలు అంటూ ఒక మెసేజ్ ని షేర్ చేసింది . అలాగే అనసూయ ఇంటి ముందు అందమైన రంగవల్లి వేసి ఇంకా అందమైన ఇంద్రధనుస్సు రంగుల చీరతో కన్ను కొడుతూ మరీ ఫోటో దిగేసరికి ఫాన్స్ అందరూ ఫిదా ఇపోయారు. ఈ పిక్స్ ని చూసిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. "అందంగా ఉండే వాళ్లకు టాక్స్ కట్టాలని పెడితే మీరే ఎక్కువ కట్టాల్సి వస్తుంది..ఇంత అందాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు...ఒక అమ్మాయిగా నేను చాలా షాకవుతున్నా మీ బాడీని ఇంత స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు. మీ శారీ చాలా బాగుంది.." అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనసూయ యాంకరింగ్‌ ఆపేసి, వరుసగా మూవీస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తోంది.. రీసెంట్ గా ఆమె విమానం అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే.. సముద్రఖని ప్రధాన పాత్రలో కనిపించరు. ఈ సినిమాలో అనసూయాది చిన్న పాత్రే అయిన ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ రోల్స్ లో అదరగొడుతోంది. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది. ప్రస్తుతం యాంకరింగ్‌కు గుడ్’బై చెప్పిన అనసూయ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్‌లో నటించనున్నారని తెలుస్తోంది. మధురవాణి క్యారెక్టర్‌లో అనసూయ కనిపించనుంది అనే టాక్ ఎప్పుడో వచ్చేసింది. ఐతే దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.