English | Telugu

ఏళ్ళ క్రితం ఏపీ జూనియర్ వింగ్ ఎన్ సిసి కమాండర్ గా అనసూయ...


జబర్దస్త్ యాంకర్ గా అనసూయ గురించి అందరికీ తెలుసు. ఈ షో ద్వారా ఈమె ఏంటో పాపులారిటీ తెచ్చుకుని తర్వాత మూవీస్ తో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇప్పుడు చేతి నిండా మూవీస్ తో ఖుషీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. మూవీస్, షోస్ ఒక వైపు మరో వైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను, అప్ డేట్స్ ని షేర్ చేస్తుంది. రీసెంట్ గా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పిక్ ని షేర్ చేసి గెస్ చేయండి ఎక్కడున్నానో అని అడిగింది. మొదట కొంతమంది ఎన్ సిసి మెంబర్స్ ఉన్న ఓ ఫోటోలో తాను ఎక్కడ ఉందో కనిపెట్టమంది. అలాగే తర్వాత ఒక ఇంటరెస్టింగ్ ఫోటోని కూడా షేర్ చేసింది.

ఆ పిక్ లో తనని హైలెట్ చేసింది.." చాలామంది కరెక్ట్ గా గెస్ చేశారు. 2000 సంవత్సరంలో న్యూఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో జరిగినప్పుడు తీసిన ఫోటో ఇది. స్కూల్ లెవల్లో నేను ఏపీ జూనియర్ వింగ్ ఎన్ సిసి కమాండర్ ని. అప్పుడు 15 స్టేట్స్ తో పోటీపడి మేము థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నాము. నా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఎన్ సిసి చాలా తోడ్పడింది" అని అప్పటి మెమరీని మరో సారి గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేసింది. ఆ తర్వాత రీసెంట్ ఫోటో ని షేర్ చేసింది. అప్పుడే 24 ఏళ్ళు అయిపొయింది, చాలా ఛేంజ్ అయ్యాను అని పోస్ట్ చేసింది. ఇలా అనసూయ స్కూల్ లెవల్లో ఎన్ సిసి కమాండర్ గా ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.. అనసూయ వరుస సినిమా ఆఫర్స్ తో ఆమె కెరీర్ మంచి ఫామ్ లో ఉంది. ఐనాసరే వీలు చేసుకుని ఫ్యామిలీతో సరదా సమయం గడపడం ఆమెకు ఇష్టం. భర్తతో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటుంది అనసూయ. రీసెంట్ గా తన హజ్బెండ్ తో కలిసి వాలెంటైన్స్ డేని సెలెబ్రేట్ చేసుకుంది. ఆ పిక్స్ ని కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. రంగ‌స్థ‌లం మూవీతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న అన‌సూయ విమానంలో నటనకు మంచి ప్రశంసలనే అందుకుంది. పుష్ప చిత్రంలో దాక్షాయణి పాత్ర ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే రోల్. ఇక ఇప్పుడు పుష్ప‌2తో అల‌రించ‌బోతుంది.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.