English | Telugu

ఆలీతో అంత సేఫ్ కాదన్న అంజలి...

"గీతాంజలి" పేరుతో వచ్చిన మూవీలో నటించిన అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఇక ఈ ఆలీతో సరదాగా షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈమెతో పాటు కోన వెంకట్ కూడా ఆలీ షోకి వచ్చారు. ‘గీతాంజలి’ మూవీకి సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీ ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కోన వెంక‌ట్ క‌థ, స్రీన్ ప్లే అందించారు. ఈ షోకి వచ్చిన అంజలి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది “ఏంటి అలాంటి ఆయన్ను చేసుకోబోతున్నావంట ? అని ఆలీ అనగానే.. “అగ్ర నిర్మాత” అని అంజలి ఆన్సర్ ఇచ్చింది. “ఈ స్టేజి మీద చేసిన డెకరేషన్ చూస్తుంటే ఏం అనిపిస్తోంది” అనగానే, “ఉగాది సెలబ్రేషన్ లా అనిపిస్తోంది” అని చెప్పింది. “పెళ్లికి చేసే డెకరేషన్ లా అనిపించడం లేదా?” అని ఆలీ అనడంతో అంజలి నవ్వేసింది . ఇక గతంలో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాతో పోల్చితే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చాలా స్పెషల్ మూవీ ఈ స్టోరీని డెవలప్ చేయడానికి కోన గారికి నాలుగేళ్లు పట్టిందని చెప్పింది.

తర్వాత షోలోకి కోన వెంకట్ ని ఇన్వైట్ చేశారు ఆలీ. "రోజు రోజుకూ పసి కూనలా తయారవుతున్నావు గ్లామర్ రహస్యం ఏమిటి" అని అడిగాడు ఆలీ. "బీ పాజిటివ్, స్టే పాజిటివ్ అనే సూత్రాలను పాటిస్తే అందరూ అందంగానే ఉంటారు" అని చెప్పాడు. "గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీలో కొత్త పాయింట్ ఏంటి ? అని ఆలీ అడగ్గా, దెయ్యాలతో షూటింగ్ చేయడమే ఈ సినిమాలో కొత్త పాయింట్" అని చెప్పారు. " 1000 రూపాయలకు ఎన్ని 50 రూపాయలు వస్తాయి" అని అంజలిని అడిగాడు ఆలీ. 10 అని అని చెప్పింది అంజలి . "నీ రెమ్యునరేషన్ నువ్వే లెక్కబెట్టుకుంటావా ? వేరెవరైనా లెక్కబెడతారా ? అని రివర్స్ లో ఆలీ అడిగేసరికి మేనేజర్ లెక్కబెడతారని చెప్పింది. ఇకపై నీ మేనేజర్ గా నేనుంటాను అని అని అన్నాడు ఆలీ. "నాకు సేఫ్ ఆయనే" అని అంజలి చెప్పడంతో "అంటే నేను సేఫ్ కాదనా" అని వెంటనే అడిగేశాడు ఆలీ.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.