English | Telugu

అదిరే అభి అసలు పేరేమిటి... ప్రభాస్‌ని అరె మావా అనడం ఏమిటి?


జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో అదిరే అభి కూడా ఒకరు. టీమ్ లీడర్ గ ఉంటూ మంచి కాన్సెప్ట్స్ తో స్కిట్స్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేవాడు. జబర్దస్త్ స్టార్టింగ్ లో అదిరే అభి స్కిట్స్ ఫుల్ కామెడీని పంచేవి. ఐతే తర్వాత కొత్త వాళ్ళు రావడంతో పాత టీమ్ లీడర్స్ చాలా మంది కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు. అలాగే అదిరే అభి కూడా వెళ్ళిపోయాడు. ఐతే అదిరే అభి పేరు ఎవరు పెట్టారు అసలు తన ఒరిజినల్ పేరేమిటో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. "అభినయ్ కృష్ణ" అనేది నా ఒరిజినల్ పేరు. ఐతే ఈ పేరు కంటే ముందు స్కూల్ లో ఉన్న పేరు "హరికృష్ణ". అభినయ్ కృష్ణ అనే పేరును సి.నారాయణ రెడ్డి గారు పెట్టారు.

ఇక ఆ పేరును అలా కంటిన్యూ చేస్తూ జబర్దస్త్ కి వచ్చినప్పుడు ఒక టాగ్ లైన్ ఉండాలి అన్నారు.. అప్పుడు "అదిరే అభి" అని పెట్టుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు. చుట్టాల పెళ్లిళ్లలో ముందుగా తానే వెళ్లి డాన్స్ చేసేవాడిని అని చెప్పారు. డిగ్రీ చదివేటప్పుడు సరే ఒకసారి ఇండస్ట్రీలో ట్రై చేద్దామని వచ్చినప్పుడు రైటర్ జనార్దన్ మహర్షి గారు చదువు కంప్లీట్ చేసుకుని రమ్మన్నారు. దాంతో వెనక్కి వచ్చి చదువు పూర్తి చేసాను అని అన్నాడు.

అలా ఒకసారి ఈశ్వర్ మూవీకి ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు తాను చేసిన డాన్స్ , మిమిక్రీ పెర్ఫార్మన్స్ చూసాక ఈశ్వర్ మూవీకి సెలెక్ట్ చేసినట్లు చెప్పాడు. ఫస్ట్ డే షూటింగ్ లో ప్రభాస్ తో "అరె మావా ఈరోజు మొత్తం జాతరకు వచ్చినట్టు వచ్చార్రా" అని చెప్పడం నిజంగా కొంచెం భయం అనిపించింది ఎందుకంటే కృష్ణం రాజు గారి వారసుడు అలాంటి అతన్ని అరె మావా అనడం ఏమిటి అనుకున్నా కానీ నటించడం ప్యాషన్ కాబట్టి చేసేసాను అని చెప్పాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.