English | Telugu

దీన్ని చూసేటప్పుడు తినొద్దు, తాగొద్దు!

స్టార్ మాతో సమానంగా పోటాపోటీగా జీ తెలుగు కూడా ఎన్నో కొత్త కొత్త షోస్ ని ఆడియన్స్ ముందుకు తెస్తోంది. ప్రతీ వారం ఏదో ఒక వెరైటీ కంటెంట్ తో జీ తెలుగు అందరి ముందుకు వచ్చేస్తోంది. ఇక ఇప్పుడు జీ సూపర్ ఫామిలీ కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సూపర్ ఫామిలీలో ఒక షోకి ఇంకో షోకి మధ్య టగ్ ఆఫ్ వార్ నిర్వహిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ చేస్తున్నాడు.

ఈ ప్రోమోలో 'అదిరింది' టీమ్, 'సరిగమప' టీమ్ పోటీపడుతున్నాయి. రెండు టీమ్స్ నుంచి కంటెస్టెంట్స్ వచ్చారు. ఈ రెండు టీములు కూడా ప్రదీప్ మీద ఫుల్ పంచ్ డైలాగ్స్ వేసేసరికి ప్రదీప్ కూడా రివర్స్ కౌంటర్లు వేస్తూ ఫన్ చేసాడు. 'అదిరింది' టీమ్ నుంచి సద్దాం టీమ్ ఆడియన్స్ కి సందడి పంచింది. షో స్టార్టింగ్ లోనే "జీ" అనే పేరువచ్చేలా కొన్ని పదాలు వాడి ఎంటర్టైన్ చేశారు.

జీ అంటే చిన్నపిల్లలు బాత్రూం కి కూర్చోపెట్టేటప్పుడు వాడే మాటను వీళ్లంతా కలిసి కొన్ని పదాలతో కలిపి అలా పలుకుతూ ఎంటర్టైన్ చేశారు. అందుకే ప్రోమో ముందు ఒక టాగ్ కూడా పెట్టేసారు "డోంట్ ఈట్ ఆర్ డ్రింక్ వైల్ వాచింగ్ థిస్ ప్రోమో" అని. కనిపిస్తుంది. ఇక తర్వాత సరిగమప టీమ్ కంటెస్టెంట్స్ అంతా వచ్చి మంచి మంచి సాంగ్స్ పాడుతూ డాన్సులు చేసి మైమరిపించారు. తర్వాత బొమ్మలు వేయించి వాటిని గుర్తుపట్టమని చెప్పే టాస్క్.

ఇలా రెండు టీమ్స్ కి వెరైటీ టాస్కులు ఇచ్చి గేమ్స్ ఆడించి ఎంటర్టైన్ చేసాడు ప్రదీప్. ఈ ఎపిసోడ్ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. సద్దాం టీమ్ లో ఒకత‌ను నిజాలన్నీ చెప్పేస్తాడు. తమిళనాడు ఆంటీ, ఓయో రూమ్ అంటూ సీక్రెట్స్ లీక్ చేసేస్తాడు సద్దాం. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.