English | Telugu

మోహన్ బాబుతో గొడవ..షోలో కన్నీళ్లు పెట్టుకున్న బెనర్జీ!

నటుడు బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన్ని చూస్తేనే భయపడతారు చాలా మంది. ఎందుకంటే ఎప్పుడూ సీరియస్ ఫేస్ తోనే కనిపిస్తారు. నవ్వడం అనేది చాలా అరుదు. ఇలాంటి సీరియస్ ఫేస్ వెనక కూడా కొన్ని బాధలు ఉన్నాయి. వాటిని ఆర్కే షోలో చెప్పి కంట తడి పెట్టారు బెనర్జీ. ఇండస్ట్రీలోకి డైరెక్టర్ అవుదామనుకొని వచ్చాను కానీ నటుడిని అయ్యాను. "ఎలా అంటే ఒకసారి అమితాబ్ సినిమాకు పనిచేస్తున్న టైంలో ఒక కన్నడ యాక్టర్ రాలేదు.

ఇక చేసేదేం లేక అమితాబ్ గారు నన్ను పిలిచి ఆ సీన్స్ చేయమని చెప్పారు. అలా నటుడిగా మారాను" అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ విషయానికి వస్తే మోహన్ బాబు సంగతేమిటి అని అడిగేసరికి.."కంటతడి పెట్టుకున్న బెనర్జీ చిరంజీవి గారు అసోసియేషన్ కోసం ఏదైనా చేద్దామనుకునే వ్యక్తి. ప్రకాష్ రాజ్ కూడా అంతే.

ఐతే ప్రకాష్ రాజ్ ప్యానల్ లో తనీష్ ని మోహన్ బాబు తిట్టారు. ఆ టైములో నేను అక్కడికి వెళ్లి గొడవలొద్దు అని విష్ణుతో చెప్పాను. పక్కనుంచి మోహన్ బాబు వచ్చి పచ్చి బూతులు తిట్టి కొట్టడానికి వచ్చారు. ఇక ఇదంతా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా" అని అన్నారు బెనర్జీ.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.