English | Telugu

అబ్బా భానుమతి...ఎంత అందంగా ఉన్నావో పళ్ళ తోటలాగా

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ ని కిట్టి పార్టీగా తీసుకురాబోతోంది. ఈ ఎపిసోడ్ కి చక్రవాకం సీరియల్ హీరోయిన్ ప్రీతి అమీన్, ఋతురాగాలు శృతి, నటకుమారి, అమూల్య గౌడ వంటి వాళ్లంతా వచ్చారు. "బేసిక్ గా కిట్టి పార్టీలో రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. మీకు ఏ గేమ్ ఇష్టం" అని అడిగింది హోస్ట్ శ్రీముఖి. "నాకు ఏ గేమ్ ఐనా గెలవడం ఇష్టం. అందుకే నేను ఈ హ్యాండ్ బ్యాగ్ తెచ్చాను" అని చెప్పింది ప్రీతీ...ఇక శృతి బ్యాగ్ చూసి శ్రీముఖి షాక్ అయ్యింది. "అమ్మో శృతి అక్క చూడు ఎంత పెద్ద బ్యాగ్ తెచ్చిందో" అనేసింది. గెలిస్తే వచ్చే డబ్బులు తీసుకెళ్లడానికి వీళ్ళు ఇంత పెద్ద బ్యాగ్ లు తెచ్చారు అన్నాడు హరి.

తర్వాత శ్రీముఖి నటకుమారి దగ్గరకు వెళ్లి "ఎప్పుడైనా రియల్ లైఫ్ లో కిట్టి పార్టీకి వెళ్ళావా" అని అడిగింది శ్రీముఖి.."వెళ్ళలేదు ఎందుకంటే నన్ను ఎవరూ పిలవలేదు" అని చెప్పింది శ్రీముఖి. ఇక అమూల్య గౌడ దగ్గరకు వచ్చి "సీరియల్ లో ఎలా ఉంటావు మీనా...చీర కట్టుకుని పూలు అమ్ముకుని పిచ్చిదానిలా ఉంటావ్...ఇక్కడ చూడు ఎలా ఉన్నావో" అంది శ్రీముఖి. దాంతో అమూల్య బ్లాక్ డ్రెస్ బ్లాక్ గాగుల్స్ తో రాంప్ వాక్ చేసింది. తర్వాత భానుమతి దగ్గరకు వెళ్ళింది శ్రీముఖి "ఈవిడ కోసం కిట్టి పార్టీ ఏంటీ సొంతంగా పార్టీ కూడా పెట్టొచ్చు.. అంత అందంగా ఉన్నారు. మీ నాన్నగారికి ఏమన్నా పళ్ళ తోట ఉందా..అందుకేనా బుగ్గలు యాపిల్ పళ్ళలా..కళ్ళు ద్రాక్ష పళ్ళలాగా..పెదాలు చెర్రీ పళ్ళలాగా ఉన్నాయి " అని తెగ మోసేసాడు హరి. దాంతో మిగతా వాళ్లంతా ఓ అంటూ కేకలేశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.