క్రేజీ కాంబో.. మాస్ రాజా సరసన నేషనల్ క్రష్!
'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని నాలుగోసారి చేతులు కలిపారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 1991 లో జరిగిన చుండూరు ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఇందులో రష్మికా మందన్న హీరోయిన్ గా నటించనుందట.