SSMB29 : ఒక్క సెట్ కి 50 కోట్లు ఏంటి సామి..!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా కోసం ఏకంగా రూ.50 కోట్లతో ఓ భారీ సెట్ వేశారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.