English | Telugu

యన్ టి ఆర్ హీరోగా శ్రీను వైట్ల చిత్రం మార్చ్ లో

యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, ప్రేక్షకుల నాడి తెలుసుకుని హిట్ మీద హిట్ తో దూసుకుపోతున్న విభిన్న యువ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక చిత్రం ప్రారంభం కానుంది. మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో ఇటీవల విడుదలైన "దూకుడు" బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ చిత్రం తర్వాత యన్ టి ఆర్ వంటి పక్కా కమర్షియల్ మాస్ హీరోతో శ్రీనువైట్ల ఎటువంటి చిత్రం చేస్తాడాని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నార

ఈ చిత్రం మీద ప్రేక్షకుల మరియూ యన్ టి ఆర్ అభిమానుల అంచనాలు భారీగానే ఉంటాయనటంలో సందేహం లేదు. ఈ చిత్రం తాలూకు స్క్రిప్ట్ విన్న హీరో యన్ టి ఆర్ చాలా హ్యాపీగా ఫీలయ్యారని సమాచారం. ఈ చిత్రాన్ని 2012 మార్చ్ నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.