English | Telugu

ట్రాక్ త‌ప్పుతున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ - నిర్మాత‌ రాధాకృష్ణ‌.. వీరిద్ద‌రి రిలేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లెద్దు. త్రివిక్ర‌మ్‌పై ఉన్న అభిమానంతోనే.. రాధాకృష్ణ నిర్మాత‌గా మారారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి.. సినిమాలొచ్చాయి. ఇప్పుడు అ..ఆ కీ ఆయ‌నే నిర్మాత‌. రాధాకృష్ణ సినిమా అంటే త్రివిక్ర‌మ్ రెమ్యున‌రేష‌న్ తీసుకోడ‌ని టాక్‌. నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటూ.. లాభాల్లో వాటా అందుకొంటాడ‌ట‌. వాళ్లిద్ద‌రిదీ అంత అవినాభావ సంబంధం. అయితే... ఇప్పుడు ఆ అనుబంధానికి బీట‌లు వారాయ‌న‌టి టాక్‌. త్రివిక్ర‌మ్ వ్య‌వ‌హార శైలి.. రాధాకృష్ణ‌కు బొత్తిగా న‌చ్చ‌డం లేద‌ని, అఆ బ‌డ్జెట్‌ని రోజురోజుకీ పెంచుకొంటూ పోవ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

అంతేకాదు.. సినిమాపై త్రివిక్ర‌మ్ స‌రిగా దృష్టి పెట్ట‌డం లేద‌ని, సినిమా అంటే ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాలే.. త్రివిక్ర‌మ్‌కి ఎక్కువ అవుతున్నాయ‌ని.. ఈ విష‌యంలో రాధాకృష్ణ‌కూ, త్రివిక్ర‌మ్‌కీ మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ వ్య‌వ‌హార శైలి న‌చ్చ‌కే.. ఈ సినిమా బృందం నుంచి మొన్న క‌ళా ద‌ర్శ‌కుడు, నిన్న సంగీత ద‌ర్శ‌కుడు బ‌య‌ట‌కు వెళ్లిపోయార‌ని స‌మాచారం. ఈ ప్ర‌భావం అఆ రిజల్ట్ పై ప‌డే అవ‌కాశం ఉంది. సినిమాపై అత్యంత ఫ్యాష‌న్ చూపించే త్రివిక్ర‌మ్‌కి ఇంతలోనే ఏమైందో మ‌రి?!

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.